News March 18, 2024

TDP నుంచి ఐదుగురు అభ్యర్థులు మెుదటిసారి ఎన్నికల బరిలో..

image

అనంతపురం వ్యాప్తంగా 14 నియోజకవర్గాలకుగాను 11 నియోజకవర్గాల MLA అభ్యర్థులను TDP అధిష్ఠానం ప్రకటించింది. వీరిలో ఐదుగురు మెుదటిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వారు సవిత(పెనుకొండ), సునీల్ కుమార్(మడకశిర), సురేంద్రబాబు(కళ్యాణదుర్గం), యశోదాదేవి(కదిరి), పల్లె సింధూరారెడ్డి(పుట్టపర్తి)లు ఉన్నారు. వారిలోనూ ముగ్గురు మహిళా అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో మెుదటిసారి ఎవరు ఎన్నికల బరిలో గెలుస్తారో కామెంట్.

Similar News

News January 19, 2026

గుంతకల్లు యువకుడికి నారా లోకేశ్ భరోసా

image

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న గుంతకల్లుకు చెందిన యువకుడు నవీన్ పరిస్థితిని గోవర్ధన్ అనే వ్యక్తి ఎక్స్(ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. నవీన్ పేగు సంబంధిత ఆపరేషన్ చేయించుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని ఆదుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన లోకేశ్ బాధితుని వివరాలు అందాయని, అతనికి వైద్య సాయం అందేలా తన కార్యాలయం అధికారులతో సమన్వయం చేస్తోందని X వేదికగా భరోసా ఇచ్చారు.

News January 19, 2026

రాష్ట్ర స్థాయి అధికారిగా మన అనంత జిల్లా వాసి

image

ఏపీ RTI కమీషనర్‌గా అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గాజుల ఆదెన్న మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈయన అనంతపురం నగర పాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పని చేశారు.

News January 19, 2026

అనంత జిల్లా స్థాయి పోటీలు

image

జూనియర్, సీనియర్ విభాగాలలో అనంత జిల్లా స్థాయి మట్టి కుస్తీ పోటీలు (మల్ల యుద్ధం) మంగళవారం 20వ తేదీన పామిడిలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్లో జరగనున్నాయి. క్రీడాకారులు మంగళవారం ఉ. 9:00 గంటలకు హాజరుకావాలని జిల్లా కార్యదర్శి ఎన్. వాణి, జిల్లా కోచ్ రాఘవేంద్ర, ఆర్మీ ఎన్ సెక్రటరీ నక్కల రామాంజనేయులు తెలిపారు. వచ్చే క్రీడాకారులందరూ ఆధార్ కార్డు, మూడు ఫొటోలు, బర్త్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు.