News March 7, 2025

అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ!

image

బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన కుమారుడు మరికొందరికి పునర్జన్మనిస్తారని తెలుసుకున్న అతని కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. HYDలో ఇంజినీరింగ్ చదువుతున్న సాయి సుబ్ర‌హ్మ‌ణ్యం బైక్ స్కిడ్ అయి బ్రెయిన్ డెడ్‌తో చనిపోయాడు. వైద్యుల సూచనతో సాయి తల్లిదండ్రులు అతని అవయవాలతో ఐదుగురికి పునర్జన్మనిచ్చారు. అతని 2 కిడ్నీలు, లివర్, హార్ట్, ఒక లంగ్స్‌ను అందించారు. అపోహలు మాని ఆపదలో ఉన్నవారిని అవయవదానంతో బతికించండి.

Similar News

News November 25, 2025

హనుమకొండ జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు

image

హనుమకొండ జిల్లాలోని 210 జీపీలకు, 1986 వార్డులకు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌లోని 69 జీపీలకు, 2వ దశలో ధర్మసాగర్, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాలలోని 73 జీపీలకు ఎన్నికలు జరగనున్నాయి. 3వ దశలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లోని 68 పంచాయతీలకు జరుగుతాయి.

News November 25, 2025

మున్సిపల్ వాటర్‌తో బెంజ్ కారు కడిగాడు.. చివరకు!

image

TG: చాలా మంది వాటర్ బోర్డ్ సరఫరా చేసే తాగునీటితోనే యథేచ్ఛగా వాహనాలను కడిగేస్తుంటారు. HYD బంజారాహిల్స్ రోడ్ నం.12లో అలా చేసిన ఓ వ్యక్తికి అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. వాటర్ బోర్డ్ ఎండీ అశోక్ రెడ్డి రోడ్డుపై వెళ్తుండగా నీటితో కారు కడగడాన్ని గమనించారు. వెంటనే అతడికి ఫైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని నగరవాసులను హెచ్చరించారు.

News November 25, 2025

T20 WC: గ్రూపుల వారీగా జట్లు

image

టీ20 ప్రపంచకప్-2026లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్, USA ఉన్నాయి. పై 4 గ్రూపుల్లో ఏది టఫ్‌గా ఉందో కామెంట్ చేయండి.
టీమ్ ఇండియా గ్రూప్ మ్యాచుల షెడ్యూల్ ఇలా:
*ఫిబ్రవరి 7న ముంబైలో USAతో, 12న ఢిల్లీలో నమీబియాతో, 15న కొలంబోలో పాకిస్థాన్‌తో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది.