News September 21, 2024

ఆతిశీ క్యాబినెట్‌లో ఐదుగురికి చోటు

image

ముఖ్య‌మంత్రి ఆతిశీ క్యాబినెట్‌లో ఐదుగురికి చోటు ద‌క్కింది. గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్‌లకు మంత్రి పదవి దక్కింది. LG వీకే స‌క్సేనా వీరితో ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ముకేశ్ అహ్లావ‌త్ మినహా మిగిలిన న‌లుగురు అర‌వింద్ కేజ్రీవాల్ క్యాబినెట్‌లో మంత్రులుగా బాధ్య‌త‌లు నిర్వహించిన వారే కావడం గమనార్హం.

Similar News

News November 6, 2025

226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు.. అప్లై చేసుకున్నారా?

image

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌(<>IGMCRI<<>>)లో 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/

News November 6, 2025

‘నీమాస్త్రం’ తయారీకి కావాల్సిన పదార్థాలు (1/2)

image

ప్రకృతి సేద్యంలోనూ చీడపీడల నివారణ ముఖ్యం. ఈ విధానంలో రసం పీల్చే పురుగులు, ఇతర చిన్న పురుగులు, పంటకు హాని కలిగించే కీటకాలతోపాటు శిలీంధ్రాల నివారణకు నీమాస్త్రం వాడతారు.
నీమాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ 5 కేజీల వేప గింజల పిండి లేదా 5 కేజీల వేప చెక్క పొడి లేదా 5 కేజీల వేప ఆకులు ☛ KG నాటు ఆవు లేదా దేశీ ఆవు పేడ ☛ 5 లీటర్ల నాటు ఆవు లేదా దేశీ ఆవు మూత్రం ☛ 100 లీటర్ల తాజా బోరు/బావి నీరు అవసరం.

News November 6, 2025

‘నీమాస్త్రం’ తయారీ, వినియోగం (2/2)

image

ముందు చెప్పిన పదార్థాలను ఒక సిమెంట్ తొట్టె/డ్రమ్ములో వేసి బాగా తిప్పాలి. 24 గంటలపాటు నీడలో పులియబెట్టాలి. గోనె సంచి కప్పిఉంచాలి. రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం 2 నిమిషాల పాటు కుడివైపునకు కలియతిప్పాలి. 24 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇదే నీమాస్త్రం. దీన్ని ఒక డ్రమ్ములో నిల్వచేసుకోవాలి. ఈ ద్రావణాన్ని నీటిలో కలపకుండా నేరుగా పంటలపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. వారం లోపు వాడేసుకోవాలి.