News July 31, 2024

టీడీపీలోకి ఐదుగురు కుప్పం YCP కౌన్సిలర్లు

image

AP: సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని శ్రీకాంత్ తెలిపారు.

Similar News

News April 2, 2026

ఒరాకిల్‌లో వారి ఉద్యోగాలే పోయాయా?

image

ఒరాకిల్‌ లేఆఫ్స్‌పై ఓ మాజీ ఉద్యోగిని చేసిన లింక్డిన్ పోస్ట్ ఐటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 34 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్న నీనా లూయిస్ 30 వేల మందిని తొలగించడంపై షాకింగ్ ఆరోపణ చేశారు. ఈ తొలగింపులు యాదృచ్ఛికంగా జరగలేదని.. ఒక ‘అల్గారిథమ్’ ఉందని ఆరోపించారు. ముఖ్యంగా కంపెనీలో ఎక్కువ స్టాక్ ఆప్షన్స్ ఉండి, అధిక జీతం తీసుకునే సీనియర్స్‌ను, మిడ్-లెవల్ మేనేజర్లనే టార్గెట్ చేసినట్లు తెలిపారు.

News April 2, 2026

మీ రుణం తీర్చుకోలేం: అమరావతి మహిళలు

image

AP: అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో ఏపీలో సంబరాలు అంబరాన్నంటాయి. ఉద్ధండరాయునిపాలెం సభలో CBN, ఆయన సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు. CBN ప్రసంగం సహా సభ అంతా ఉద్వేగభరితంగా సాగింది. ముఖ్యంగా సుదీర్ఘ పోరాటం చేసిన మహిళలు సభ అనంతరం CM దంపతులకు భావోద్వేగంతో ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ జన్మకు ఇది చాలు సార్. మా బతుకులు నిలబెట్టారు. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేం’ అని అన్నారు.

News April 2, 2026

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి కీలక ప్రకటన

image

TG: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులో రెండో విడత లబ్ధిదారుల ఎంపికను ప్రారంభిస్తామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించారు. అటు రంగారెడ్డి జిల్లా ఆమనగల్‌లో భూభారతి పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు.