News August 7, 2025

డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్ చెయ్.. కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్

image

TG: కులగణన సర్వేపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్వేపై ప్రజెంటేషన్ ఇస్తామని, డేట్, టైమ్, ప్లేస్ ఆయనే ఫిక్స్ చేయాలని సవాల్ విసిరారు. ఢిల్లీకి రమ్మన్నా అధికారులను తీసుకొని వస్తానని, కిషన్ రెడ్డి అనుమానాలను నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇక 2029లో కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌దే విజయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News August 7, 2025

పోలీసులు, టీడీపీ నేతల కుమ్మక్కు: బొత్స

image

AP: రాష్ట్రంలో పోలీసులు, TDP నేతలు కుమ్మక్కై YCP నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. కూటమి సర్కార్ దుష్ట పాలన చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను బొత్స, కారుమూరి, కొట్టు, వెల్లంపల్లి కలిశారు. ‘కూటమి ప్రభుత్వ అరాచకాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల ZPTC ఎన్నిక నిర్వహించాలని కోరాం’ అని తెలిపారు.

News August 7, 2025

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై CM రేవంత్ స్పందించారు. ‘భారీ వర్షాల సమాచారం దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి. HYDలో భారీ వర్షసూచన దృష్ట్యా అధికారులు సమన్వయంతో పని చేయాలి. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు వెంటనే సంబంధిత సిబ్బంది చేరుకొని చర్యలు చేపట్టాలి’ అని ఆదేశించారు.

News August 7, 2025

రోజూ మాంసం తింటే..!

image

ముక్క లేనిదే ముద్ద దిగదు అనేవారు ఎక్కువ కాలం జీవించలేరని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. రోజూ లేదా వారానికి మూడు కంటె ఎక్కువ సార్లు ప్రాసెస్డ్ & రెడ్ మీట్ తినడం ఆరోగ్యానికి హానికరం అని తేలింది. 4,75,000 మందిపై చేసిన అధ్యయనంలో మాంసం తినడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి 25 రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. పరిమితంగా మాంసం తినొచ్చని సూచించారు.