News November 8, 2024

FLASH: కామారెడ్డి: విషాదం.. బైక్ టైరు పేలి చనిపోయాడు..! 

image

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లి గ్రామ శివారులోని 44వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన స్వామిగౌడ్ బైక్‌పై వస్తుండగా ఒక్కసారిగా టైరు పేలింది. దీంతో పక్కనే ఉన్న రోడ్డు సీలింగ్‌కు వేగంగా ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

Similar News

News November 10, 2025

NZB: అజారుద్దీన్‌ను కలిసిన రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్

image

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా నియమితులై సోమవారం మంత్రిగా రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్‌ను రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి మరింత కృషి చేయాలని అజారుద్దీన్‌ను తాహెర్ బిన్ హందాన్ కోరారు.

News November 10, 2025

నిజామాబాద్‌లో కూరగాయల ధరల వివరాలు..!

image

నిజామాబాద్ లో కూరగాయల మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట రూ.20 కేజీ, వంకాయ రూ.35, బెండకాయ బీరకాయ, దొండకాయ రూ.50, చిక్కుడు రూ.50, క్యాబేజీ రూ.25, కాలిఫ్లవర్ రూ.50, మిరపకాయ రూ.35, కాకరకాయ రూ.40, బీరకాయ, బెండకాయ రూ.50, దొండకాయ రూ.50, పాలకూర రూ.50, తోటకూర రూ.30, గోరుచిక్కుడు రూ.50, మునగా కాయ రూ.70, ఉల్లిగడ్డ రూ.100కు ఐదు కేజీలు, సొరకాయ రూ.20, క్యారెట్ రూ.50లకు కేజీ ధర పలుకుతున్నాయి.

News November 8, 2025

KMR: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

image

ఆన్‌లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ.1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోసపోయినట్లు తెలిసి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.