News February 1, 2025

FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

image

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 6, 2025

మహబూబ్‌నగర్: లారీ కిందపడి గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం

image

మహబూబ్‌నగర్ జిల్లా బండమీదిపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  పాలమూరు యూనివర్సిటీ ఎదురుగా సైకిల్‌పై వస్తూ నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన లారీ( ట్రక్కు) కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దీంతో పాలమూరు యూనివర్సిటీ నుంచి అర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

News March 6, 2025

జడ్చర్ల: క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి హత్య

image

క్రేన్ మరమ్మతుల కోసం వచ్చి <<15574517>>వ్యక్తిని <<>>హత్య చేసిన ఘటన MBNR జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామంలో జరిగింది. హైదరాబాద్ ఎంజీబీఎస్లో పోలీసులు బుధవారం నిందితుణ్ని అరెస్ట్ చేశారు. కేసు పూర్వాపరాలను డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. 24వ తేదీన క్రేన్ మరమ్మతు కోసం పుణేకు చెందిన వినయ్ రాగా అతను బస చేస్తున్న గది వద్ద బిహార్‌కు చెందిన రషీద్‌తో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతన్ని గోడకేసి బాది చంపేశాడు.

News March 6, 2025

విద్యార్థినికి నియామక పత్రం అందజేసిన సీఎం

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చదివిన విద్యార్థిని పూజిత మొన్న వనపర్తిలోని ఉద్యోగం మేళాకు ఎంపికైంది. త్రెడ్ ఐటీ కంపెనీలో ఉద్యోగం సాధించిన పూజితకు సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ కే.ఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థి మంచి ఉద్యోగం సాధించడం తమకు గర్వకారణం అన్నారు

error: Content is protected !!