News February 1, 2025

FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

image

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 16, 2026

జగిత్యాల: దివ్యాంగుల సాధికారతే లక్ష్యం: మంత్రి అడ్లూరి

image

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత సహాయక పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వ పథకాల ద్వారా అందించే సహాయాన్ని నేరుగా అందించడమే లక్ష్యమన్నారు.

News January 16, 2026

37 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏఎస్పీ మహేందర్

image

అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ 1989లో పోలీస్ శాఖలో చేరి 37 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలంపాటు నిర్విరామంగా సేవలందిస్తూ, క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజాసేవలో ఆదర్శంగా నిలుస్తోన్న అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సేవలను ఎస్పీ కొనియాడారు.

News January 16, 2026

రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశం!

image

జియో పాలిటిక్స్, పాక్ నుంచి ఉగ్రవాదం నేపథ్యంలో రక్షణ రంగంలోకి భారీగా FDIలకు అవకాశమివ్వాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం అనుమతులతో అవసరం లేని ఆటోమేటిక్ లైసెన్సింగ్ విధానంలో 49% వరకు FDIలకు అవకాశం ఉంది. దీన్ని 74% పెంచనుందని ‘రాయిటర్స్’ పేర్కొంది. భారత భాగస్వామి కంపెనీల్లో విదేశీ రక్షణ సంస్థలకు మెజార్టీ వాటాకు అవకాశం కల్పించనుంది. ఆధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే దీని లక్ష్యమని తెలిపింది.