News February 1, 2025
FLASH.. గద్వాల: జాతీయ రహదారిపై లారీని ఢీకొన్న బస్సు

ఉండవెల్లి మండలం పుల్లూరు టోల్ ప్లాజా సమీపంలో 44 జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒక లారీని ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బస్సు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొంది. వెనకనే వస్తున్న మరో బస్సు ముందున్న బస్సును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ చంద్రశేఖర్ తో పాటు ఆరుగురికి గాయాలు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 3, 2025
వరంగల్: ట్విస్ట్.. ఆశాలపల్లిలో ఏకగ్రీవం లేనట్లే..!

జిల్లాలోని సంగెం(M) ఆశాలవల్లిలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం దిశ నుంచి పోటీ మూడ్కు మారింది. SC మహిళ మల్లమ్మ సర్పంచ్ అవుతారనే ఊహాగానాలకు చెక్ పడింది. గ్రామ యువకుడు కార్తీక్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నక్కలపల్లి యువతి నవ్యశ్రీకి BRS-BJPలు బ్యాకింగ్ ఇవ్వడంతో బరిలోకి దిగింది. ప్రేమలో గెలిచిన నవ్యశ్రీ సర్పంచ్గానూ గెలుస్తుందా? లేక అధికార పార్టీ వర్గాల మద్దతున్న మల్లమ్మ విజయం సాధిస్తారా? తెలియాల్సి ఉంది.
News December 3, 2025
మెదక్: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు

మెదక్ జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కొల్చారం, కౌడిపల్లి, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని 183 సర్పంచ్, 1,523 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు
News December 3, 2025
సిద్దిపేట: నేటి నుంచి 3వ విడత నామినేషన్లు ప్రారంభం

సిద్దిపేట జిల్లాలో నేటి నుంచి 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. అక్కన్నపేట, చేర్యాల, దుల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమురవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూరు మండలాల్లోని 163 సర్పంచ్, 1,432 వార్డులకు నామినేషన్లు స్వీకరించనున్నారు. క్లస్టర్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నామినేషన్లు స్వీకరిస్తారు. సాం.5గ. తర్వాత నామినేషన్ కేంద్రం ప్రధాన గేట్ మూసివేస్తారు.


