News December 25, 2024
FLASH: నరసరావుపేట హైవేపై బస్సు బోల్తా

నరసరావుపేట మండలం ఉప్పలపాడు-పెట్లూరివారిపాలెం మధ్య ఉన్న రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న నరసరావుపేట అగ్నిమాపక సిబ్బంది, గ్రామీణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Similar News
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.
News November 18, 2025
ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.
News November 18, 2025
మాదక ద్రవ్యాల నిర్మూలనకు గుంటూరు పోలీసుల ‘సంకల్పం’

జిల్లాలో మాదక ద్రవ్యాలను సమూలంగా అరికట్టేందుకు గుంటూరు పోలీసులు సరికొత్త అస్త్రం సిద్ధం చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలో సంకల్పం అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లా వ్యాప్తంగా కాలేజీల్లో యువతకు అవగాహన కల్పించనున్నారు. తొలిగా తుళ్లూరు పీఎస్ పరిధిలోని VIT యూనివర్సిటీ ప్రాంగణంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.


