News April 3, 2025
FLASH: వనపర్తి జిల్లాలో యాక్సిడెంట్

వనపర్తి జిల్లా పెబ్బేర్లో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానిక భవాని వైన్స్ ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న కంచిరావుపల్లి గ్రామానికి చెందిన విష్ణుచారిని AP39UC7200 నంబర్ గల లారీ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విష్ణు చేయి, కాలు నుజ్జునుజ్జయింది. పెబ్బేర్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Similar News
News November 8, 2025
జయప్రకాశ్ రెడ్డి హత్య కేసులో తల్లి హస్తం?

బి.కొత్తకోట మండలంలో <<18222445>>దారుణహత్య<<>>కు గురైన జయప్రకాశ్ రెడ్డి హత్యకేసులో తల్లి హస్తం ఉన్నట్లు సమాచారం. గోళ్లతోపు గ్రామం గుడివారిపల్లికి చెందిన జయప్రకాష్ రెడ్డి(25) శుక్రవారం ఊరికి సమీపంలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహీంద్ర ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు, ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలతో హత్య వేనుక తల్లి ప్రమేయమున్నట్లు అనుమానిస్తున్నారు.
News November 8, 2025
NEEPCLలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు

నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 8, 2025
ఉప్పుడు బియ్యానికి అనుకూలమైన వరి రకం

ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేసే రకం M.T.U 3626(ప్రభాత్). ఈ వరి రకం పంట కాలం 120 నుంచి 125 రోజులు. గింజ పొడవు మరియు ముతక రకం. ఈ రకం చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. M.T.U 3626 వరి రకం ఉప్పుడు బియ్యం, నూకకు అత్యంత అనుకూలం. ఎకరాకు 3 నుంచి 3.5 టన్నుల దిగుబడినిస్తుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు.


