News January 29, 2025
FLASH: వరంగల్: బావిలో దూకిన మహిళ.. కాపాడిన పోలీసులు

భూ తగాదాలతో బావిలోకి దూకిన గిరిజన మహిళను పోలీసులు ప్రాణాలతో రక్షించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అజ్మీరా మంగ అనే మహిళ బుధవారం వ్యవసాయ బావిలో దూకింది. స్థానికుల సమాచారం మేరకు.. ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు కలిసి ఆ మహిళను బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా కుటుంబాల మధ్య జరుగుతున్న భూ తగాదాలతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు.
Similar News
News November 25, 2025
నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?

నిజామాబాద్ జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
మొదటి విడత: చందూర్, మోస్రా, రుద్రూర్, వర్ని, కోటగిరి, పోతంగల్, బోధన్, రెంజల్, నవీపేట్, సాలూర మండలాలలో..
రెండో విడత: ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZB రూరల్, సిరికొండ, జక్రాన్పల్లి మండలాల్లో..
మూడో విడత: ఆర్మూర్, బాల్కొండ, కమ్మర్పల్లి, భీమ్గల్, మోర్తాడ్, మెండోరా, నందిపేట్ మండలాల్లో జరగనున్నాయి.
News November 25, 2025
మిద్దె రాములు.. నిన్ను మరువమయ్యా

<<18388157>>మిద్దెరాములు<<>> తెలంగాణ ఒగ్గుకళారూపానికి వన్నె తెచ్చిన ప్రముఖ ఒగ్గు కళాకారుడు ఆకాశవాణి, దూరదర్శన్లో 200కు పైగా ప్రదర్శనలు చేసి దేశ దేశాలకు ఒగ్గుకథను ప్రాచుర్యం చేశాడు. 1990లో మారిషస్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో చేసిన ప్రదర్శనకు అక్కడి ప్రధాని, గవర్నర్ ప్రశంసలు అందజేశారు. ‘జానపద కళా బ్రహ్మ’, ‘ఒగ్గు కథా చక్రవర్తి’, ‘కళాపురస్కార్’ బిరుదులు పొందారు. దాదాపు 50 ఏళ్లలో 50,000కు పైగా ప్రదర్శనలు చేశారు.
News November 25, 2025
కామారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?

మొదటి విడత (11.12.2025): భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల్లో..
రెండో విడత(14.12.2025): లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, మహమ్మద్ నగర్, పిట్లం, నిజాంసాగర్ మండలాల్లో..
మూడో విడత(17.12.2025): బిచ్కుంద, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడప్గల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో జరగనున్నాయి.


