News January 29, 2025

FLASH: వరంగల్: బావిలో దూకిన మహిళ.. కాపాడిన పోలీసులు

image

భూ తగాదాలతో బావిలోకి దూకిన గిరిజన మహిళను పోలీసులు ప్రాణాలతో రక్షించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో అజ్మీరా మంగ అనే మహిళ బుధవారం వ్యవసాయ బావిలో దూకింది. స్థానికుల సమాచారం మేరకు.. ఫైర్ సిబ్బంది, పోలీసులు, స్థానికులు కలిసి ఆ మహిళను బావిలో నుంచి బయటకు తీశారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా కుటుంబాల మధ్య జరుగుతున్న భూ తగాదాలతోనే ఆమె ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు.

Similar News

News November 17, 2025

అమలాపురం: పీజీఆర్ఎస్‌కు 29 ఫిర్యాదులు

image

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

అమలాపురం: పీజీఆర్ఎస్‌కు 29 ఫిర్యాదులు

image

అమలాపురంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో సోమవారం ‘పీజీఆర్ఎస్’ (పోలీస్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్) జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 29 సమస్యలు వచ్చాయి. లిఖితపూర్వకంగా అర్జీలు స్వీకరించిన ఎస్పీ, వాటిని చట్ట పరిధిలో విచారించి, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

చిత్తూరు పోలీసులకు అందిన 38 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై 38 ఫిర్యాదులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిని చట్టప్రకారం విచారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఎస్పీ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు.