News February 13, 2026

FLASH: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం BRS జోరు కొనసాగింది. 24 వార్డుల్లో 13 BRS అభ్యర్థులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 8, BJP 2, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో BRS పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతర మున్సిపాలిటీల ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

Similar News

News February 14, 2026

MDK: పార్టీ మారి గెలిచినా.. ఆశలు గల్లంతు!

image

రామాయంపేట మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 5వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ చరిత విజయం సాధించారు. కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో ఆమె తండ్రి సుప్రభాత్ రావు బీఆర్‌ఎస్‌లో చేరి కుమార్తెను గెలిపించుకున్నారు. అయితే మున్సిపల్ పీఠం దక్కించుకోవడంలో బీఆర్‌ఎస్ ఆధిక్యం సాధించలేకపోవడంతో ఛైర్మన్ పదవిపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. గెలిచినా నిరాశే ఎదురైంది.

News February 14, 2026

వరంగల్ బల్దియాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు!

image

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారులు అర్హతలేని 15 మందికి అక్రమ మార్గాన ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన అర్హత లేని వారికి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఉద్యోగాలు కట్టబెట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి రూ.1,50,000 పుచ్చుకొని చైన్‌మెన్ ఉద్యోగాలు కల్పించినట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది.

News February 14, 2026

రైతును రాజుగా మార్చడమే మా లక్ష్యం: అచ్చెన్నాయుడు

image

రాష్ట్రంలో రైతును రాజుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని AP వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. యువత వ్యవసాయంవైపు మళ్లాలంటే సాగును లాభదాయక వృత్తిగా మార్చాలని అభిప్రాయపడ్డారు. దీని కోసం ప్రకృతి వ్యవసాయం, సాగులో సాంకేతికత, పండిన పంటకు గిట్టుబాటు ధర, కోత అనంతర పంట నష్టాలను తగ్గించడం, అధిక ఆదాయం వచ్చే పంటలవైపు రైతులను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు.