News July 4, 2024
FLASH.. ఏసీబీకి చిక్కిన కరీంనగర్ డీసీఎంఎస్ మేనేజర్

కరీంనగర్ డీసీఎంఎస్ కార్యాలయంలో జరిగిన దాడుల్లో మేనేజర్ వెంకటేశ్వర రావు, క్యాషియర్ కుమారస్వామిలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు రూ.లక్ష డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో లంచం తీసుకుంటున్న ఇద్దరిని పట్టుకుని, అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News February 23, 2026
కరీంనగర్లో ప్రజావాణిలో 367 వినతులు స్వీకరణ

జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే పాల్గొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా వాణి దరఖాస్తులను ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ 367 దరఖాస్తులు స్వీకరించారు.
News February 23, 2026
క్రీడల్లో కరీంనగర్ పోలీసుల పతకాల వేట

సైబరాబాద్లో జరిగిన 4వ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు 35 పతకాలతో సత్తా చాటారు. ఇందులో 9 స్వర్ణ, 13 రజత, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏసీపీ మాధవి, పీసీలు స్వప్న, శ్రీజ, శ్రీధర్ పలు విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచారు. విజేతలను సీపీ గౌష్ ఆలం అభినందిస్తూ.. విధి నిర్వహణలో ఉంటూనే క్రీడల్లో రాణించడం గర్వకారణమని కొనియాడారు.
News February 22, 2026
రేపు యథావిధిగా ‘ప్రజావాణి’: జిల్లా కలెక్టర్

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఉదయం నిర్ణీత సమయానికి అధికారులు హాజరై ఫిర్యాదులను స్వీకరిస్తారని పేర్కొన్నారు.


