News December 25, 2025

FLASH: నార్కట్‌పల్లిలో యాక్సిడెంట్.. ఛిద్రమైన శరీరం..!

image

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. లూనాపై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శరీరభాగాలు ఛిద్రమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకుని శరీర భాగాలను ఒక చోటికి చేర్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 26, 2025

కామారెడ్డి: అటకెక్కిన ‘ఇందిరమ్మ’ మోడల్ హౌస్ నిర్మాణం!

image

సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులు తమ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో అవగాహన కల్పించేందుకు ప్రతి మండలలో ఒక ‘ఆదర్శ ఇందిరమ్మ ఇల్లు’ నిర్మించాలని నిర్ణయించింది. అయితే, పిట్లంలో ఈ ఆదర్శ గృహ నిర్మాణం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. పనులు ప్రారంభమై తొమ్మిది నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. సగంలోనే ఆగిపోయి దర్శనమిస్తోంది.

News December 26, 2025

2026: అడ్మినిస్ట్రేషన్ నామ సంవత్సరంగా..!

image

TG: CM రేవంత్ రెడ్డి 2026లో పరిపాలనపై పూర్తి ఫోకస్ ఉంటుందని సంకేతాలిచ్చారు. ప్రభుత్వ పాలసీల లీక్ ఆగడం, రెవెన్యూ పెంపు తదితరాలకు అధికారుల్లో తనకు పట్టు ముఖ్యమని గ్రహించి ఇందుకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల ఉన్నతాధికారులతో 3గం. సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పనితీరుపై ప్రతి నెలా CS రివ్యూ చేస్తారని, 3 నెలలకు ఓ సారి తానే సమీక్షిస్తానని చెప్పారు. అన్ని శాఖల్లో పేపర్లకు బదులు e ఫైల్స్ అమలు చేయాలని ఆదేశించారు.

News December 26, 2025

జీవీఎంసీలో ఇక నుంచి 10 జోన్‌లలో పరిపాలన

image

మహా నగరం విశాఖ శరవేగంగా విస్తరిస్తుంది. జీవీఎంసీ పరిధిలో జోన్‌ల పునర్వ్యవస్థీకరణ పూరైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న ఎనిమిది జోన్‌లను పది జోన్‌లుగా విభజించారు. అగనంపూడి, మర్రిపాలెం వద్ద రెండు జోన్లను ఏర్పాటు చేశారు. ఆ రెండు జోన్లకు జోనల్ కమిషనర్లు, ఇతర కార్యాలయ సిబ్బందిని కూడ నియమించారు. జనవరి 1 నుంచి అమలు అయ్యే విధంగా జీవీఎంసి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.