News September 21, 2025
FLASH.. పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి తాళం

పెండింగ్ బిల్లులు చెల్లించలేదని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ తాళం వేశాడు. రూ.4కోట్ల బిల్లులు ఇవ్వట్లేదని హన్మకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తాళం వేశాడు. కార్యక్రమం కోసం వెళ్లగా, తాళం వేసి ఉండటంతో అధికారులు ఖంగుతిన్నారు. కార్యక్రమాలు జరగకుండా తాళం వేసినందుకు కాంట్రాక్టర్ శ్రీకాంత్ రెడ్డిపై అధికారులు ఫిర్యాదు చేయగా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News September 21, 2025
డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా బీచ్ ఫెస్టివల్ ప్రచారం: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ సూర్యలంక బీచ్ ఫెస్టివల్, ప్రపంచ పర్యాటక దినోత్సవం ప్రచారానికి ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బాపట్ల, చీరాల, ఇంకోల్లు, గుంటూరు ప్రాంతాల నుంచి 35కి పైగా ఇన్ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. వారు ఏపీ టూరిజం సహకారంతో తీరప్రాంత సౌందర్యం, సాంస్కృతిక వైభవాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా ప్రోత్సహించేందుకు అంగీకరించారు.
News September 21, 2025
అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలి: కలెక్టర్

ఈ నెల 22 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటకల నుంచి కూడా భక్తులు భారీగా వస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు.
News September 21, 2025
జీవీఎంసీలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

జీవీఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని రేపు రద్దు చేస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. విశాఖలో రెండు రోజులపాటు ఈ గవర్నెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం చంద్రబాబునాయుడును ఆ సదస్సుకు హాజరవుతున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.