News August 22, 2025
FLASH: శామీర్పేట్ చెరువులో యువకుడి మృతదేహం కలకలం

శామీర్పేట్ పెద్ద చెరువులో పడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చెరువులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీశారు. మృతుడు చెరుకూరి రసూల్(25)గా గుర్తించామని తెలిపారు. మృతుడు మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ వద్ద నివాసం ఉంటున్నట్లు చెప్పారు.
Similar News
News August 22, 2025
గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలి: కామారెడ్డి కలెక్టర్

మిల్లర్లు సీఎమ్ఆర్ డెలివరీ త్వరితగతిన పూర్తి చేసి ఇవ్వాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఐడీఓసీ హాల్లో మిల్లర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25కు సంబంధించి సెప్టెంబర్ 12లోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలన్నారు. సీఎంఆర్ డెలివరీ చేయని మిల్లులపై చర్యలు తీసుకుంటామని, 100% డెలివరీ చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
News August 22, 2025
BREAKING: DSC మెరిట్ జాబితా విడుదల

AP: మెగా DSC మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక <
News August 22, 2025
పనుల జాతరలో అదనపు కలెక్టర్ నగేష్

పనుల జాతరను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. శుక్రవారం హవేలిగణపూర్ మండలం చౌట్లపల్లిలో పనుల జాతర నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ విజయ లక్ష్మి, ఎంపీడీఓ ఏపీఓ, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆసక్తి గల లబ్దిదారులు పశువుల కొట్టాలు, వ్యక్తిగత సోక్ పిట్ల కోసం దరఖాస్తులను అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు(నరేగ) పనుల జాతరలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.