News March 28, 2024
FLASH: పరీక్షల తేదీలు మారాయ్

JEE మెయిన్ సెషన్-2 పరీక్ష తేదీల్లో మరోసారి మార్పులు జరిగాయి. APR 4 నుంచి 15 వరకు జరగాల్సిన పరీక్షలను APR 4 నుంచి 12 వరకే నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. అంతకుముందు APR 1 నుంచి 15 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపిన NTA.. రెండుసార్లు తేదీల్లో మార్పులు చేసింది. విద్యార్థులు సిటీ ఇంటిమేషన్ వివరాలను jeemain.nta.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చు. త్వరలో అడ్మిట్ కార్డులు విడుదల కానున్నాయి.
Similar News
News March 18, 2026
భద్రగిరి మార్ట్ లోగో సిద్ధం: ఐటీడీఏ పీవో రాహుల్

ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ‘భద్రగిరి మార్ట్’ లోగోను ఎంపిక చేసినట్లు పీవో రాహుల్ బుధవారం తెలిపారు. లోగో రూపకల్పన కోసం నిర్వహించిన పోటీకి విశేష స్పందన లభించిందని, వచ్చిన వాటిలో అత్యుత్తమ లోగోను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్ట్ను శ్రీరామనవమి పర్వదినాన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గిరిజన ఉత్పత్తుల విక్రయానికి వేదికగా నిలిచే ఈ మార్ట్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 18, 2026
ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

AP: 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా, 2027 JAN 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
News March 18, 2026
గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

AP: గ్రూప్-2 నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.


