News March 18, 2024
FLASH.. HYD: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్నగర్ 44వ జాతీయ రహదారి MSN పరిశ్రమ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 25, 2026
ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: RR కలెక్టర్

ప్రజాపాలనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఫైల్స్ క్లియర్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, శ్రీనివాస్, డీఆర్వో సంగీత, తదితరులు ఉన్నారు.
News March 25, 2026
రంగారెడ్డి జిల్లాలో 13 మంది MLAలు అయ్యే చాన్స్

రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 8 నియోజకవర్గాల సంఖ్య 13కు చేరే అవకాశం ఉంది. రాజేంద్రనగర్లో కొత్తగా శంషాబాద్ ఏర్పడనుంది. మహేశ్వరం నుంచి కొత్తగా సరూర్నగర్ పేరుతో మరో నియోజకవర్గం ఏర్పడే అవకాశం ఉంది. ఎల్బీనగర్ నుంచి కొత్తగా హయత్నగర్ మరో నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో కొంత భాగాన్ని దీనిలో కలిపే ఛాన్స్ ఉంది. ఈ మేరకు కొత్త నేతలకు అవకాశాలు లభించనున్నాయి.
News March 25, 2026
రంగారెడ్డి: మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో కొత్తగా మరో 5 అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 24,46,265 మంది ఉండగా, 2024 డిసెంబర్ నాటికి కేవలం 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్యే 35,91,987కు చేరడం గమనార్హం. వీరిలో 526 గ్రామ పంచాయతీల పరిధిలో 7,94,653 మంది ఓటర్లు ఉండగా, 6 మున్సిపాలిటీల పరిధిలో 1,75,974 మంది ఉన్నారు.


