News September 7, 2024

FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా

image

AP: శ్రీసత్యసాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు ముందు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 8, 2025

విదేశాల్లో వాస్తు పాటిస్తారా?

image

‘వాస్తు నియమాలు నిర్ధిష్ట ప్రాంతానికి పరిమితం కాదు. ప్రపంచంలో ఎక్కడ నివసించినా, వ్యక్తిగత అలవాట్లు వేర్వేరుగా ఉన్నా, పంచభూతాల నియమాలు ఎవరూ విస్మరించలేరు. ప్రపంచంలో వాస్తు సూత్రాలను నిర్లక్ష్యం చేస్తే అది జీవన మనుగడకే ముప్పుగా మారొచ్చు. వాస్తును ప్రాంతాల వారీగా విభజించడం, ఓ ప్రాంతానికే పరిమితం చేయడం అపోహ మాత్రమే. ఈ నియమాలు విశ్వమంతటా పాటించదగినవి’ అని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్.. తొలిరోజు పెట్టుబడుల వెల్లువ

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో తొలిరోజు పెట్టుబడులు వెల్లువెత్తాయి. రూ.1.88 లక్షల కోట్లకు సంబంధించిన 35 ఒప్పందాలు కుదిరాయి. రంగాల వారీగా ఆ వివరాలు ఇలా..
* డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ&కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- రూ.1,04,000 కోట్లు
* రెన్యూవబుల్ ఎనర్జీ&పవర్ సెక్యూరిటీ- రూ.39,700 కోట్లు
* ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్- రూ.19,350 కోట్లు
* అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ – రూ.13,500 కోట్లు

News December 8, 2025

చంద్రుడిపై చివరి అడుగుకు 53 ఏళ్లు

image

US ‘అపోలో-11’ మిషన్ ద్వారా 1969లో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టారు. ఆ తర్వాత పలు మిషన్లలో 12మంది ‘మామ’ను కలిసి వచ్చారు. జాబిలిపై మనిషి చివరిసారిగా కాలుమోపి 53ఏళ్లవుతోంది. 1972 DEC 7-19 మధ్య అపోలో-17 ద్వారా యూజీన్, హారిసన్ మూన్‌పై దిగారు. 75గంటలు గడిపి రోవర్‌పై 35KM ప్రయాణించారు. 110KGల రాళ్లు, మట్టిని తీసుకొచ్చారు. వాటి ద్వారా అక్కడ ఒకప్పుడు అగ్నిపర్వతం ఉండేదని గుర్తించారు.