News September 7, 2024

FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా

image

AP: శ్రీసత్యసాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు ముందు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 1, 2026

FASTag: ఫిబ్రవరి 1 నుంచి KYV తొలగింపు

image

ఫాస్టాగ్ జారీలో జాప్యం లేకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. లైట్ వెయిట్ వెహికల్స్ అయిన కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్(KYV) ప్రాసెస్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఫిబ్రవరి FEB 1 నుంచి అమల్లోకి రానున్నట్లు పేర్కొంది. సరైన పత్రాలున్నప్పటికీ ఫాస్టాగ్ యాక్టివేషన్‌లో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే వాహనదారులకు దీని ద్వారా ఊరట లభించనుంది.

News January 1, 2026

హెల్మెట్‌కు పాలస్తీనా జెండా.. JK11 ప్లేయర్ అరెస్ట్

image

పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ పెట్టుకుని డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడిన JK11 టీమ్ ప్లేయర్ ఫుర్కాన్ భట్‌ను జమ్మూ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ & కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా జమ్మూ ట్రయల్ బ్లేజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లీగ్ నిర్వాహకుడు జహీద్ భట్‌ను కూడా విచారించనున్నారు.

News January 1, 2026

పాలమూరు-రంగారెడ్డిపై చర్చకు KCR వచ్చేనా?

image

TG: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం అన్యాయం చేస్తోందని BRS చీఫ్ KCR ఇటీవల ఆరోపించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. KCRకు సమాధానమిచ్చేందుకు CM రేవంత్, మంత్రులు సన్నద్ధమయ్యారు. కాగా తొలిరోజు సభకు వచ్చిన KCR 3 ని.లలోనే వెళ్లిపోయారు. శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యే సభకు ఆయన వస్తారో లేదో సందిగ్ధంగా మారింది. సవాల్ విసిరి రాకపోతే ఒకింత నష్టమేనన్నభావన BRS వర్గాల్లో ఉంది.