News September 7, 2024

FLASH: ఆర్టీసీ బస్సు బోల్తా

image

AP: శ్రీసత్యసాయి జిల్లా గుమ్మలకుంట దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సు ముందు టైర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 19, 2025

నేషనల్ మెగా షిప్‌బిల్డింగ్ క్లస్టర్‌కు 3,488 ఎకరాలు: CBN

image

AP: తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో నేషనల్ మెగాషిప్ బిల్డింగ్, రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు సహకరించాలని CM CBN కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్‌ను కోరారు. ‘దీనికి అవసరమైన 3,488 ఎకరాలు కేటాయిస్తాం. టెక్నో–ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంది. వెంటనే అనుమతివ్వండి’ అని కోరారు. ఫేజ్1లో ₹1361.49 కోట్లతో 4 హార్బర్ల పనులు చేపట్టామని, వాటికి కేంద్రం నుంచి రావలసిన నిధులివ్వాలని విన్నవించారు.

News December 19, 2025

UIIC 153 పోస్టులకు నోటిఫికేషన్

image

యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్‌ (<>UIIC<<>>) 153 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ (BE/B.Tech/BSc/B.Com/BBA/BCA) అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 21- 28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఎంపికైన వారికి స్టైపెండ్ నెలకు రూ.9,000 చెల్లిస్తారు. డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uiic.co.in

News December 19, 2025

పిల్లలకు న్యుమోనియా ఉందా?

image

శీతాకాలంలో పిల్లలు న్యుమోనియా ప్రమాదం ఎక్కువ. అధిక జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఆక్సిజన్ తగ్గితే చర్మం, పెదవులు నీలం రంగులోకి మారతాయి. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకం కాబట్టి వెంటనే వైద్యులను సంప్రదించాలి. న్యుమోనియా ఉన్న పిల్లల గదిని శుభ్రంగా, వెచ్చగా ఉంచడం, సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, సూప్ ఇవ్వాలని సూచిస్తున్నారు.