News October 7, 2024
బొగ్గు గని పేలుడులో ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్ బీర్భూమ్లోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. గంగారాంచక్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కోలిరీలో బొగ్గు తవ్వి తీసేందుకు పేలుళ్లు చేపట్టగా ప్రమాదం జరిగినట్లు సాక్షులు చెబుతున్నారు. మరికొందరికి గాయాలయ్యాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
ఢిల్లీ పొల్యూషన్.. రెండో రాజధానే సొల్యూషనా?

పొల్యూషన్కు పర్యాయపదంగా ఢిల్లీ మారిపోయింది. దీంతో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశ పరిపాలనా వ్యవహారాలకూ ఇబ్బంది కలుగుతోంది. హరియాణా, పంజాబ్లలో పంట వ్యర్థాల కాల్చివేతలతోపాటు లెక్కకుమించిన వాహనాలూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటు వాదన బలపడుతోంది. దీనివల్ల ఢిల్లీపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మరి ఏ నగరం రెండో రాజధానికి అనుకూలం? కామెంట్
News January 7, 2026
ఒకటిన్నర ఎకరా పొలం.. అద్భుత ఆలోచనతో అధిక ఆదాయం

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.
News January 7, 2026
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.


