News September 2, 2024
FLASH: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

AP: శ్రీశైలం గేట్లు ఎత్తుతుండగా సాంకేతిక సమస్య ఎదురైంది. 2, 3 గేట్ల ప్యానల్లో బ్రేక్ కాయిల్ కాలిపోయింది. వరద ఉద్ధృతితో గేట్లను మరింత పైకి ఎత్తుతుండగా ఈ ఘటన జరిగింది. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు.
Similar News
News December 11, 2025
నకిలీ విత్తనాలు అమ్మితే ₹30L వరకు ఫైన్ వేయాలి: TG ప్రభుత్వం

TG: నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలకు ₹50వేల నుంచి ₹30లక్షల వరకు ఫైన్, మూడేళ్ల జైలు, ఐదేళ్ల నిషేధం విధించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసింది. ‘విత్తనోత్పత్తి సంస్థ నిర్వాహకులు, డీలర్లు, పంపిణీదారుల విద్యార్హత అగ్రికల్చర్ డిప్లొమా/డిగ్రీగా ఉండాలి. ప్రత్యేక విత్తన రకాల నమోదు, విత్తన ధరలు నియంత్రించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలి’ అని కేంద్ర విత్తన చట్టం-2025 ముసాయిదాపై నివేదిక ఇచ్చింది.
News December 11, 2025
మేడిన్ ఇండియా హైడ్రోజన్ ట్రైన్ వచ్చేస్తోంది

భారతీయ రైల్వే నిర్మించిన తొలి హైడ్రోజన్ ట్రైన్కు త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్సభలో వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన (10 కోచ్లు), అత్యంత శక్తిమంతమైన (2400 కిలోవాట్లు) హైడ్రోజన్ ట్రైన్గా ఇది గుర్తింపు పొందినట్లు చెప్పారు. రెండు డ్రైవింగ్ పవర్ కార్స్ (DPCs), ఎనిమిది ప్యాసింజర్ కోచ్లతో ఈ రైలును పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు.
News December 11, 2025
జాగ్రత్తగా ఓటేయండి.. గ్రామాల పురోగతికి పాటుపడండి!

TG: గ్రామాల అభివృద్ధి, ప్రజల సమస్యలు తీర్చడంలో సర్పంచ్లదే కీలకపాత్ర. నోటు, క్వార్టర్, బిర్యానీకి ఆశపడి ఓటును అమ్ముకుంటే ఐదేళ్లూ ఇబ్బందిపడాల్సిందే. కులం, బంధుత్వాలు, పార్టీలు చూసి అసమర్థుడికి ఓటేస్తే అధోగతే. అందుకే 24/7 అందుబాటులో ఉండే, సమస్యలపై స్పందించే నాయకుడిని ఎన్నుకోవాలి. ఇందులో యువత పాత్ర కీలకం. సమర్థుడికి <<18527601>>ఓటేసి<<>>, కుటుంబీకులతోనూ ఓట్లేయించి గ్రామాల పురోగతికి పాటుపడండి.


