News October 20, 2024
FLASH: ‘బద్వేల్’ ఘటనలో యువతి మృతి
AP: ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా <<14399353>>గాయపడిన<<>> బాలిక(17) కడప రిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు విఘ్నేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్సార్(D) బద్వేల్ సమీపంలో నిన్న ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో బాలిక శరీరం 80 శాతం కాలిపోయింది.
Similar News
News October 20, 2024
టీటౌన్ రూమర్: OG మూవీలో అకీరా నందన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమా ద్వారా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అకీరా తన తండ్రితో కలిసి నటించనున్నారని తెలియడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు.
News October 20, 2024
పెట్రోల్ దాడిలో బాలిక మరణం కలచివేసింది: అనిత
AP: వైఎస్సార్ జిల్లాలో ఉన్మాది పెట్రోల్ పోసి నిప్పంటించడంతో బాలిక <<14403526>>మరణించడం<<>> దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అనిత చెప్పారు. విద్యార్థినిపై దాడి అనంతర దృశ్యాలు, పరిస్థితులు తీవ్రంగా కలచివేశాయన్నారు. నిందితుడు విఘ్నేశ్, అతనికి సహకరించిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. బాధితురాలి కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
News October 20, 2024
అశోక్నగర్లో మళ్లీ ఉద్రిక్తత
TG: హైదరాబాద్ అశోక్నగర్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. వారికి మద్దతుగా ప్రతిపక్ష నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా రేపటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.