News September 10, 2024
హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు

TG: HYDలోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ GHMC అధికారులు, పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు పెట్టారు. పెద్ద ఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. కాగా ఏటా నగరం నలువైపుల నుంచి భారీగా వినాయక విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News November 14, 2025
భారీ జీతంతో DIOలో ఉద్యోగాలు

డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్(DIO) 7 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BSc, B.Tech, BE, MSc, ME, M.Tech, MBA/PGDM అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. డిప్యూటీ ప్రోగ్రామ్ డైరెక్టర్కు నెలకు రూ.1,40,000-1,80,000, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్కు రూ.80,000-రూ.1,20,000, DPEకు రూ.40,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్సైట్: idex.gov.in/
News November 14, 2025
‘మల్లె’ తోటల్లో కొమ్మల కత్తిరింపుతో లాభమేంటి?

మల్లె తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల మొక్క ఆరోగ్యం మెరుగుపడి, కొత్త కొమ్మలు త్వరగా పెరుగుతాయి. పువ్వు పరిమాణం, నాణ్యత, పువ్వుల దిగుబడి కూడా పెరుగుతుంది. చనిపోయిన, బలహీనమైన, అనారోగ్యకరమైన కొమ్మలను తొలగించడం వల్ల మొక్క మిగిలిన భాగాలకు శక్తి, పోషకాలు అంది మొక్క దృఢంగా పెరుగుతుంది. ప్రతి కొమ్మను నేల నుంచి 6-12 అంగుళాల ఎత్తులో కత్తిరించాలి. ప్రతి సీజన్లో 25-30% కొమ్మలను మాత్రమే తొలగించాలి.
News November 14, 2025
అనుమతుల్లేని ప్లాట్ల యజమానులకు మరో అవకాశం

AP: లే అవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ గడువును GOVT 2026 JAN 23 వరకు పొడిగించింది. ప్లాట్ల యజమానులు LTP ద్వారా పీనలైజ్, ఇతర ఛార్జీలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. గడువులోగా దరఖాస్తు చేస్తే ఓపెన్ ప్లేస్ ఛార్జీల్లో 50% రాయితీ ఇస్తారు. ఈ అవకాశం మళ్లీ ఉండకపోవచ్చంటున్నారు. కాగా రెగ్యులర్ కాని PLOTSలో నిర్మాణాలకు అనుమతివ్వరు. నిర్మాణాలున్నా తొలగిస్తారు. రిజిస్ట్రేషన్ కాకుండా నిషేధిత జాబితాలో చేరుస్తారు.


