News September 14, 2024

త్వరలో దుబాయ్, సింగపూర్‌లకు విమానాలు: రామ్మోహన్

image

APలో విమాన ప్రయాణికుల సంఖ్య మరింత పెంచుతామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో విజయవాడ-ఢిల్లీ ఇండిగో సర్వీసును ఆయన ప్రారంభించారు. ‘3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభించాం. OCT 26న విజయవాడ-పూణె, అక్టోబర్ 27న విశాఖ-ఢిల్లీ సర్వీసులు ప్రారంభిస్తాం. త్వరలోనే దుబాయ్, సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభిస్తాం. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా కనెక్టివిటీ పెంచుతాం’ అని ప్రకటించారు.

Similar News

News January 24, 2026

రేపు రథ సప్తమి.. ఇలా చేయండి

image

రథ సప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. రేపు సూర్యుడు ఉత్తరాయణ మార్గంలో ప్రయాణం ప్రారంభిస్తాడని పురాణాలు చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపించాలి. బియ్యం, గోధుమలు, బెల్లం, గోధుమ పిండి, దుస్తులు దానం చేస్తే శుభాలనిస్తుంది. మాంసాహారం, మద్యం సేవించకూడదు. కోపం, చెడు మాటలకు దూరంగా ఉండాలి.

News January 24, 2026

మున్సిపల్ ఎన్నికలకు BRS ఇన్‌ఛార్జుల నియామకం

image

TG: త్వరలో ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సమన్వయకర్తలను నియమించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. వీరు అభ్యర్థుల ఎంపిక, శ్రేణులను సమన్వయం చేయడం, ప్రచార వ్యూహాలను రచిస్తారు. ఎన్నికల సరళిని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయానికి తెలియజేస్తారు. ప్రజల మద్దతుతో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు KTR పిలుపునిచ్చారు.

News January 24, 2026

T20 WC నుంచి బంగ్లా ఔట్.. ఏం జరిగింది?

image

బంగ్లాలో అల్లర్లు, హిందువులపై దాడులతో భారతీయుల్లో నిరసన వ్యక్తమైంది. దీంతో IPLలో KKR తరఫున ఆడాల్సిన ముస్తాఫిజుర్‌ను తొలగించాలని BCCI ఆదేశించింది. అందుకు ప్రతీకారంగా BAN తమ దేశంలో IPL ప్రసారాన్ని నిలిపివేయడంతో వివాదం ముదిరింది. INDలో T20 WCకు తామూ రాబోమని BAN మొండికేసింది. వేదికల మార్పు కుదరదని ICC తేల్చి చెప్పింది. BAN తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో WCకు ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంది.