News September 17, 2024

కేంద్రం నుంచి వరద సాయం.. చంద్రబాబు ఏమన్నారంటే?

image

AP: రాష్ట్రానికి కేంద్రం నుంచి వరద సాయంపై ఇప్పుడే చెప్పలేమని సీఎం చంద్రబాబు అన్నారు. ముందుగానే అంచనా వేయడం సరికాదని, వచ్చాక వెల్లడిస్తామని చెప్పారు. విద్యార్థులకు అన్ని పుస్తకాలు అందిస్తామని తెలిపారు. వరదల్లో సర్టిఫికెట్లు పోగొట్టుకున్న వారికి తిరిగి అన్నీ అందిస్తామన్నారు. స్టడీ మాత్రమే కాకుండా ల్యాండ్, రేషన్ కార్డుల వంటివి కూడా అందజేస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: తూర్పుగోదావరి జిల్లాలోని మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 12 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. కేస్ వర్కర్, MTS, సోషల్ వర్కర్, ఎడ్యుకేటర్, కుక్, సైకో-సోషల్ కౌన్సెలర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, PG, సైకాలజీ డిప్లొమా/న్యూరో సైన్స్ , LLB, B.Sc. B.Ed, టెన్త్, ఏడో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: eastgodavari.ap.gov.in

News December 6, 2025

పిల్లల ఎదుగుదలలో తొలి రెండేళ్లూ కీలకం

image

పిల్లలు ఎదిగే క్రమంలో శారీరకంగానూ మానసికంగానూ తొలి రెండేళ్ల వయసూ చాలా కీలకమంటున్నారు నిపుణులు. దాదాపు 90 శాతం మెదడు ఎదుగుదల తొలి రెండేళ్లలోనే జరుగుతుంది. కాబట్టి మేధోపరంగా, ఆరోగ్యపరంగా వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఈ రెండేళ్లలోనే నిర్ణయమైపోతుంది. పైగా ఆ వయసులో పిల్లల మెదడు పెద్దల మెదడుకన్నా రెట్టింపు చురుగ్గా ఉంటుంది. పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటే పిల్లల ఎదుగుదల అంత బావుంటుందంటున్నారు.

News December 6, 2025

DANGER: పబ్లిక్ వైఫై వాడుతున్నారా?

image

పబ్లిక్ వైఫై సేవలు వినియోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయొద్దని సూచించారు. ఇలా చేయడం వల్ల సైబర్ మోసగాళ్ల వలలో పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘అత్యవసరమైతేనే వైఫై వాడండి. అపరిచిత వెబ్‌సైట్స్‌కు సంబంధించిన పాప్అప్‌ను పట్టించుకోవద్దు. సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయండి’ అని పిలుపునిచ్చారు.