News March 27, 2024

వడగాడ్పుల హెచ్చరికలు.. రాష్ట్రాలకు ఈసీ కీలక సూచనలు

image

మార్చి-జూన్ మధ్య వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉందన్న IMD హెచ్చరికల నేపథ్యంలో ఈసీ అప్రమత్తమైంది. సార్వత్రిక ఎన్నికల్లో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు సీఈసీ లేఖ రాసింది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, సరైన నీడ, మెడికల్ కిట్, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలంది. సీనియర్ సిటిజన్లు, గర్భిణులు, పోలింగ్ ఏజెంట్లకు ఫర్నీచర్‌‌తో పాటు ప్రత్యేక టాయిలెట్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Similar News

News March 21, 2026

భక్తులకు అల్పాహారం వడ్డించిన చంద్రబాబు

image

AP: తిరుమలలో భక్తులకు సీఎం చంద్రబాబు అల్పాహారం వడ్డించారు. శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సమేతంగా ఆయన వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లారు. అక్కడ CBN, భువనేశ్వరి, లోకేశ్, దేవాన్ష్ వడ్డించారు. తర్వాత వారు అల్పాహారం స్వీకరించారు. దేవాన్ష్ పేరుతో ఒక్కరోజు అన్నదాన వితరణకు రూ.44 లక్షలు విరాళం అందించారు. ఏటా తన మనవడి పుట్టిన రోజు సందర్భంగా విరాళం అందజేస్తున్నారు.

News March 21, 2026

యశ్ దయాల్‌కు షాక్ ఇచ్చిన RCB!

image

మరో వారంలో IPL ప్రారంభం కానుండగా RCB కీలక బౌలర్ యశ్ దయాల్ ప్రాక్టీస్ క్యాంపులో కనిపించకపోవడం చర్చకు దారి తీస్తోంది. ఆయనపై రేప్ <<17189705>>ఆరోపణలు<<>> ఉన్న నేపథ్యంలో జట్టు నుంచి తప్పించి ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ఇక టీమ్ ట్రావెల్ బస్సుపై యశ్ మినహా మిగతా ప్లేయర్లందరి ఫొటోలు ఉండటం దీనికి బలం చేకూరుస్తోంది. అటు దయాల్ గత నెల రహస్యంగా పెళ్లి చేసుకోగా ఇటీవల ఆ విషయం బయటికొచ్చిన విషయం తెలిసిందే.

News March 21, 2026

రాష్ట్రంలో నాన్‌వెజ్.. నాన్‌స్టాప్!

image

TG: రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. 2013-14లో 2.30 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2024-25 నాటికి 11.12 లక్షల టన్నులకు పెరిగినట్లు పేర్కొంది. 2019 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.26 కోట్ల పశుసంపద ఉందని తెలిపింది. గొర్రెల సంఖ్యలో దేశంలోనే తొలి స్థానంలో, పౌల్ట్రీలో మూడో ప్లేస్‌లో నిలిచినట్లు చెప్పింది.