News July 8, 2024

అస్సాంలో వరదలు.. 72 మంది మృతి

image

అస్సాంలో భారీ వర్షాల ధాటికి వరద ఉధృతి కొనసాగుతోంది. వరదల్లో తాజాగా మరో ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 72కి చేరింది. మూగ జీవాలు సైతం ప్రాణాలు కోల్పోతున్నాయి. కజిరంగ నేషనల్ పార్కులో దాదాపు 131 జంతువులు మృత్యువాత పడ్డాయి. కాగా ఆ రాష్ట్రంలో సహాయక చర్యలను సీఎం హిమంత బిశ్వశర్మ పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News November 28, 2025

NZB: 30న జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు

image

నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న జిల్లా స్థాయి సీనియర్ మహిళా, పురుషుల జిల్లా జట్ల ఎంపికల ప్రక్రియ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ముప్కాల్‌లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందులో పాల్గొనే పురుషుల వ్యక్తిగత శరీర బరువు 85 kgలు, మహిళల వ్యక్తిగత శరీర బరువు 75 kgల లోపు ఉండాలన్నారు.

News November 28, 2025

‘పిచ్చుకల పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేయాలి’

image

కాకినాడ జిల్లాలోని ప్రతి విద్యార్థికి స్వయంగా ధాన్యం కుంచె తయారీ నేర్పించి, పిచ్చుకల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తునికి చెందిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు పి. దాలినాయుడు కోరారు. గురువారం ఆయన కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ షాన్‌మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పిచ్చుకల పరిరక్షణకు తాను చేపట్టిన కార్యక్రమం వివరాలను ఆయన కలెక్టర్‌కు వివరించారు.

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్