News October 28, 2024

ధరల భారంతో నష్టాల్లో FMCG మార్కెట్!

image

Nifty FMCG స్టాక్స్ నేల‌చూపులు చూస్తున్నాయి. గ‌త ఆరేళ్ల‌లో లేని విధంగా Octలో ఇండెక్స్ 9.6% న‌ష్ట‌పోయింది. Sep Q2 ఫ‌లితాలు కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఇన్వెస్ట‌ర్ల‌లో ఆందోళన నెల‌కొంది. క‌మోడిటీల‌ అధిక ధ‌ర‌ల‌తో అర్బ‌న్ ప్రాంతాల్లో అమ్మ‌కాలు తగ్గ‌డం ఈ ప‌రిశ్ర‌మ మీద భారం మోపిన‌ట్టు తెలుస్తోంది. భ‌విష్య‌త్తు ఫ‌లితాల‌పై కంపెనీలు ఆచితూచి మాట్లాడుతుండ‌డం కూడా సెంటిమెంట్‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చిన‌ట్టైంది.

Similar News

News December 1, 2025

పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

image

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్‌) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News December 1, 2025

వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

image

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్‌ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.

News December 1, 2025

CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత

image

AP: సీఎం చంద్రబాబుపై ఉన్న లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ హయాంలో నమోదైన ఈ కేసు దర్యాప్తును ముగిస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. దాని ఆధారంగా ఏసీబీ కోర్టు కేసును మూసేసింది. అలాగే ఆయనపై ఉన్న ఫైబర్‌నెట్ కేసును క్లోజ్ చేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.