News November 4, 2024
త్వరలో FMCG ఉత్పత్తుల ధరల పెంపు?

షాంపూలు, సబ్బులు, బిస్కెట్లు వంటి రోజువారీ వాడుకునే FMCG ఉత్పత్తుల ధరలు త్వరలోనే పెరిగే అవకాశం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా SEPలో సంస్థల మార్జిన్లు తగ్గడం, పామాయిల్, కాఫీ, కోకో వంటి ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో సంస్థలు ధరల పెంపు సిగ్నల్స్ పంపాయి. పట్టణాల్లో HUL, గోద్రెజ్,మారికో, ITC, టాటా FMCG ప్రొడక్ట్స్ వినియోగం తగ్గడంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. త్వరలో ధరల పెంపుపై ప్రకటన చేసే ఛాన్సుంది.
Similar News
News November 5, 2025
నేడు తులసి పూజ ఎందుకు చేయాలి?

కార్తీక పౌర్ణమి రోజునే తులసీ మాత భూమిపైకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు తప్పకుండా తులసికి గంగాజలంతో పూజ చేయాలంటారు పండితులు. ఫలితంగా భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. తులసి కోట వద్ద దీపారాధన చేసి, దీపదానం చేస్తే.. లక్ష్మీ దేవి సంతోషించి, కటాక్షాన్ని ప్రసాదిస్తుందట. అంతేకాక, పసుపు పూసిన నాణాన్ని ఎరుపు వస్త్రంలో ఉంచడం వలన కుటుంబంలో సంపదలు పెరిగి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం.
News November 5, 2025
అనూరాధ కార్తెలో అనాథ కర్రయినా ఈనుతుంది

అనూరాధ కార్తె(నవంబర్) సమయంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఈ కాలంలోని అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు, వ్యవసాయానికి ఎంతగానో తోడ్పడతాయి. సాధారణంగా ఫలవంతం కాని లేదా పనికిరాని మొక్క (కర్ర) కూడా ఈ కార్తెలో విపరీతమైన దిగుబడిని ఇస్తుందని.. ఈ సమయంలో రైతులు మంచి పంట దిగుబడిని ఆశించవచ్చనే విషయాన్ని ఈ సామెత నొక్కి చెబుతుంది.
News November 5, 2025
కార్తీక పౌర్ణమి.. ఈరోజు ఉపవాసం ఉండాలా?

కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. ‘ఇవాళ తె.జా.4.52-ఉ.5.44 మధ్య నదీ స్నానం చేసి, వెంటనే కార్తీక దీపాలు వదలాలి. ఉపవాసం ఉండాలి. ఆహారం తీసుకోకుండా ఉండలేనివారు పాలు, పండ్లు తీసుకోవడం మేలు. సత్యనారాయణస్వామి కథ వినడం లేదా చదవడం శుభప్రదం. సాయంత్రం శివాలయాలు, విష్ణు మందిరాల్లో 365వత్తులతో దీపారాధన చేయాలి. ఇందుకు సా.5.15-రా.7.05 మధ్య మంచి సమయం. దీపారాధన తర్వాత ఉపవాసం విరమించాలి’ అని పండితులు చెబుతున్నారు.


