News May 19, 2024

మల్టీ లెవెల్ కార్ పార్కింగ్‌పై దృష్టిపెట్టండి: కేటీఆర్

image

TG: హైదరాబాద్‌లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్(MLCP) పనులు పూర్తి కావడంపై మాజీ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘2016/17లో నాంపల్లి మెట్రో స్టేషన్‌ వద్ద PPP మోడ్‌లో ఈ పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించాం. కొన్ని సమస్యలతో ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు పూర్తయ్యింది. కీలకమైన జంక్షన్లు, మెట్రో స్టేషన్లు, వాణిజ్య కేంద్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటివి ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Similar News

News December 6, 2025

MBBS ప్రవేశాల్లో బాలికలదే పైచేయి: మంత్రి

image

AP: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి GOVT, PVT వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాలు ముగిశాయి. ఇందులో 60.72% అడ్మిషన్లు అమ్మాయిలే పొందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే వీరి ప్రవేశాలు 3.66% పెరిగాయన్నారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది అమ్మాయిలు సీట్లు పొందారని చెప్పారు. స్కూల్ దశ నుంచే ప్రణాళికతో చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.

News December 6, 2025

లైఫ్ సపోర్ట్‌పై ‘ఇండీ కూటమి’: ఒమర్

image

బిహార్ CM నితీశ్ NDAలోకి వెళ్లడానికి ఇండీ కూటమే కారణమని J&K CM ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. రెండేళ్ల కిందట కూటమి కన్వీనర్‌గా తన అభ్యర్థిత్వాన్ని కొందరు అడ్డుకున్నారని చెప్పారు. HT లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘బిహార్ మహాగట్‌బంధన్‌లో JMM చేరలేదు. రేపు జాతీయస్థాయిలోనూ అది కూటమిని వీడితే తప్పెవరిది? ప్రస్తుతం మా కూటమి లైఫ్ సపోర్ట్‌పై ఉంది. కొందరైతే దాని కథ ముగిసిందంటున్నారు’ అని పేర్కొన్నారు.

News December 6, 2025

కంపెనీలు ఈ బిల్లుకు మద్దతివ్వాలి: ఉద్యోగులు

image

లైఫ్‌లో ఉద్యోగం ఓ పార్ట్. కానీ ప్రస్తుతం ఉద్యోగమే జీవితమైపోతోంది. టెకీలైతే రోజులో 12-14 గంటలు పనిచేస్తున్నారు. దీంతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. పని ఒత్తిడితో కుటుంబాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ‘<<18487853>>రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు<<>>’ను తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగి మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే పనిలో ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఈ బిల్లుకు కంపెనీలూ మద్దతు ఇవ్వాలంటున్నారు.