News September 23, 2024

టికెట్ లేని ప్రయాణికులపై ఫోకస్

image

పండుగల సమయాల్లో టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారిపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా పోలీసులే ఉన్నట్లు గుర్తించిన రైల్వే వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. అలాంటి వారిపై రైల్వే యాక్ట్ 1989 ప్రకారం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం వచ్చే నెల 1 నుంచి 15 వరకు, 25 నుంచి నవంబర్ 10 వరకు తనిఖీలు నిర్వహించనుంది.

Similar News

News September 23, 2024

కోదండరాంకు రేపు TJAC సన్మానం

image

TJAC ఆధ్వర్యంలో ఈ నెల 24న MLC కోదండరాంను సన్మానించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన అప్పటి తమ ఛైర్మన్ కోదండరాం కృషి మరువలేనిదని JAC నేతలు అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత ఆయనకు MLC ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, గెజిటెడ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్-1 ఇలా 205 సంఘాలతో JAC ఏర్పాటైందని గుర్తు చేశారు.

News September 23, 2024

బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం

image

TG: మహబూబ్‌నగర్(D) దేవరకద్ర(మ)లో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిన్న బయటకు వచ్చిన బాలికను కిడ్నాప్ చేసిన ఆటోడ్రైవర్ పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టి అనంతరం వదిలిపెట్టాడు. ఇంటికొచ్చిన బాలిక కూలి పనులకు వెళ్లొచ్చిన తల్లికి విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదైంది. చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు.

News September 23, 2024

ప్రభుత్వం పిరికిపంద చర్యలు ఆపాలి: BRS

image

TG: డాక్టర్లతో తాము ఏర్పాటు చేసిన బృందం ఆసుపత్రులను సందర్శిస్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని BRS ప్రశ్నించింది. వైద్యారోగ్య సేవల తీరుపై అధ్యయనం చేసే డాక్టర్ల బృందాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారని పేర్కొంది. డా.తాటికొండ రాజయ్య, డా.కల్వకుంట్ల సంజయ్, డా.మెతుకు ఆనంద్ ఇళ్ల వద్దకు చేరిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంది. ప్రభుత్వం ఇలాంటి పిరికిపంద చర్యలు మానుకోవాలని హితవు పలికింది.