News June 27, 2024

తాగు నీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలి: పవన్ కళ్యాణ్

image

AP: అతిసారం కేసులు పెరుగుతున్నందున తాగు నీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంచి నీటి సౌకర్యంలేని గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర నిధులను వాడుకోలేకపోయిందన్నారు. ఇకపై వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పథకం అమలు, నిధుల వివరాలు అందించాలని అధికారులకు సూచించారు.

Similar News

News September 20, 2024

దేవర తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాలివే

image

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ఏయే సినిమాల్లో నటిస్తారోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి మూవీల లైనప్‌ గురించి తారక్ క్లారిటీ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల 21 నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్ స్టార్ట్ కానుంది. జనవరిలో ఆ సినిమా షూటింగ్‌లో తారక్ జాయిన్ అవుతారు. ఆలోపు హృతిక్ రోషన్‌తో ‘వార్ 2’ పూర్తి చేస్తారు. నీల్‌తో సినిమా షూట్ అనంతరం దేవర పార్ట్-2 షూట్ చేస్తారు.

News September 20, 2024

సెప్టెంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

✒ 1924: ప్రముఖ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జననం
✒ 1933: హోంరూల్ ఉద్యమ నేత అనీ బిసెంట్ మరణం
✒ 1949: బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ పుట్టినరోజు
✒ 1954: ప్రముఖ కమెడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం జననం
✒ 1999: తమిళ నటి టి.ఆర్.రాజకుమారి మరణం
✒ రైల్వే భద్రతా దళ(RPF) వ్యవస్థాపక దినోత్సవం

News September 20, 2024

నేను రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని: మహేశ్‌కుమార్ గౌడ్

image

TG: దేశంలోని SC, ST, BC, మైనార్టీలకు న్యాయం జరగాలని పోరాడుతున్న మహానుభావుడు రాహుల్ గాంధీ అని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కొనియాడారు. అందుకే ఆయన్ను చంపుతామని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తాను రాహుల్ వదలిన బీసీ బాణాన్ని అని చెప్పారు. కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. BRS ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను 42 నుంచి 23 శాతం తగ్గించిందని దుయ్యబట్టారు.