News June 4, 2024
ధర్మాన సోదరుల వెనుకంజ

AP: SKLM జిల్లాలో ధర్మాన సోదరులకు షాక్ తగిలింది. SKLM అసెంబ్లీ అభ్యర్థిగా YCP తరఫున బరిలో దిగిన మంత్రి ధర్మాన ప్రసాదరావుపై.. TDP అభ్యర్థి గొండు శంకర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నరసన్నపేట నుంచి బరిలో దిగిన YCP అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్పై TDP అభ్యర్థి బగ్గు రమణమూర్తి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. జిల్లాలో కూటమి అభ్యర్థుల జోరు కొనసాగుతోంది. మెజార్టీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News January 22, 2026
విజయనగరం జిల్లా ఎస్. కోటలో మెగా జాబ్మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, విజయనగరం జిల్లా ఎస్ కోట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జనవరి 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హత గల అభ్యర్థులు https://naipunyam.ap.gov.inలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. 10 మల్టీ నేషనల్ కంపెనీలు 535 పోస్టులను భర్తీ చేయనున్నాయి.
News January 22, 2026
ఎన్కౌంటర్లో 15కు చేరిన మావోయిస్టు మృతుల సంఖ్య

ఝార్ఖండ్ <<18923190>>ఎన్కౌంటర్<<>> ఘటనలో మావోయిస్టు మృతుల సంఖ్య 15కు చేరింది. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ ఉన్నారు. ఆయనపై రూ.5 కోట్ల రివార్డు ఉండడం గమనార్హం. సింగ్భూం జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
News January 22, 2026
ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్.. రూ.5వేల కోట్ల పెట్టుబడి

తెలంగాణను AI డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో CM రేవంత్ బృందం MOU కుదుర్చుకుంది. ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100MW సామర్థ్యంతో AI డేటా సెంటర్ను నెలకొల్పనుంది. ఐదేళ్లలో ₹5,000Cr పెట్టుబడి పెట్టనుంది. 100MW సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 4వేల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.


