News October 26, 2024
ఓటమిలోనూ మీ వెంటే: ఫ్యాన్స్

టెస్ట్ సిరీస్ ఓటమితో ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న టీమ్ ఇండియాకు కొందరు ఫ్యాన్స్ బాసటగా నిలుస్తున్నారు. ఓటమిలోనూ మీ వెంటే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వరుస విజయాలు సాధించినప్పుడు ప్రశంసించడమే కాదు.. వరుస పరాజయాలు ఎదురైనప్పుడు కూడా వారికి అండగా నిలవాలని అంటున్నారు. మరోవైపు సొంత గడ్డపై భారత జట్టు సిరీస్ కోల్పోవడాన్ని కొందరు ఫ్యాన్స్ జీర్ణించుకోలేక ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 26, 2025
సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణి

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.
News November 26, 2025
వచ్చే ఏడాది చివరికి కిలో వెండి రూ.6 లక్షలు: కియోసాకి

బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయని రచయిత, బిజినెస్మ్యాన్ రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 50 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధరలు త్వరలోనే 7 డాలర్లకు పెరగవచ్చని, వచ్చే ఏడాది చివరికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రూ.1.55 లక్షలు ఉన్న కిలో వెండి ధర రూ.6.2 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.
News November 26, 2025
వేరుశనగ పంటకు నీటిని ఏ సమయంలో అందించాలి?

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.


