News September 18, 2024
రైల్లో ఫుడ్ డెలివరీ.. మరిన్ని స్టేషన్లలో ‘జొమాటో’ సేవలు

రైలు ప్రయాణికులకు ZOMATO తన సేవలను విస్తరించింది. ట్రైన్లో ఉండగా ఫుడ్ ఆర్డర్ చేస్తే సీట్ల వద్దకే డెలివరీ చేస్తోంది. 2023లో 5 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్టేషన్లలో అందిస్తోంది. ఇప్పటివరకు 10లక్షల ఆర్డర్లు డెలివరీ చేసింది. వెయిటింగ్ ప్యాసింజర్లకూ ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేయవచ్చు.
Similar News
News November 15, 2025
రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

బెంగళూరులోని <
News November 15, 2025
మూవీ ముచ్చట్లు

* Globetrotter ఈవెంట్లో SSMB29 టైటిల్ వీడియో ప్లే అయ్యాక ఆన్లైన్లో రిలీజ్ చేస్తాం: రాజమౌళి
* రజినీకాంత్ హీరోగా తాను నిర్మిస్తున్న ‘తలైవర్ 173’ మూవీ నుంచి డైరెక్టర్ సి.సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్
* దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే కాంబోలో వచ్చిన ‘కాంత’ చిత్రానికి తొలిరోజు రూ.10.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్
* రోజుకు 8 గంటల పని శరీరానికి, మనసుకు సరిపోతుంది: దీపికా పదుకొణె
News November 15, 2025
వట్టి నేలపై కూర్చోకూడదా?

మన శాస్త్రాల ప్రకారం.. వట్టి నేలపై నేరుగా కూర్చోకూడదు. తప్పనిసరిగా వస్త్రం/పీట/ చాపను ఉపయోగించాలి. మన శరీరం విద్యుత్ కేంద్రం వంటిది. భూమికి అయస్కాంత తత్వం ఉంటుంది. నేరుగా కూర్చున్నప్పుడు, మన శరీరంలోని జీవ విద్యుత్ శక్తి భూమిలోకి ప్రసరించి, వృథా అవుతుంది. ఇలా శరీరంలోని శక్తి తగ్గుతుంది. ఆ ప్రభావం మన ఆరోగ్యంపై పడి, వ్యాధులు రావొచ్చు. ఆ శక్తిని కాపాడుకోవడానికి ఈ నియమం పెట్టారు. <<-se>>#Scienceinbelief<<>>


