News February 8, 2025

‘వందే భారత్’లో ఫుడ్.. రైల్వే కీలక నిర్ణయం

image

వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు రైల్వే శాఖ మరో సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోని వారికి కూడా అప్పటికప్పుడు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. అయితే రాత్రి 9 గంటలలోపు మాత్రమే ఫుడ్ బుక్ చేసుకోవాలి. ప్రయాణాల్లో ఆహారం దొరకడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు IRCTC పేర్కొంది. క్వాలిటీ ఫుడ్ అందించాలని సంబంధింత విభాగాలను ఆదేశించింది.

Similar News

News November 17, 2025

మోక్ష మార్గాన్ని చూపే విష్ణు శ్లోకం

image

ఏష మే సర్వధర్మాణాం ధర్మో ధిక తమోమతః|
యద్భక్త్యా పుణ్డరీకాక్షం స్తవైరర్చేన్నరస్సదా||
‘పద్మముల వంటి కన్నులు గల విష్ణువును ఎవరైతే భక్తితో, స్తోత్రములతో ఆరాధిస్తారో.. అదే అన్ని ధర్మముల కంటే గొప్పదైనది’ అని ఈ శ్లోకం చెబుతోంది. ఇతర కర్మలు, వ్రతాలు, ఆచారాల కంటే దేవుడి పట్ల నిష్కల్మషమైన ఆరాధన, కీర్తన అత్యంత ముఖ్యమైనది, ఉత్తమమైనది. శుద్ధమైన భక్తి భావమే మనకు మోక్ష మార్గాన్ని చూపుతుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News November 17, 2025

గర్భ నిరోధక ఇంజెక్షన్ గురించి తెలుసా?

image

పిల్లలు పుట్టకుండా ఉండేందుకు అనేక పద్ధతులు పాటిస్తారు. అయితే కొన్నిసార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. వీటికి ప్రత్యామ్నాయమే ఈ ఇంజెక్షన్. దీన్ని డిపోమెట్రోక్సీ ప్రొజెస్టెరాన్ అసిటేట్ (DMPA) ఇంజెక్షన్ అంటారు. 3నెలల పాటు గర్భం రాకుండా మహిళలు ఈ ఇంజెక్షన్ వాడొచ్చు. తర్వాత నెల విరామంతో మరో ఇంజెక్షన్ తీసుకోవాలి. దీనివల్ల రోజూ గర్భనిరోధక మాత్ర వేసుకోవాల్సిన అవసరం ఉండదు.

News November 17, 2025

తమ్ముడి కులాంతర వివాహం.. అన్న దారుణ హత్య!

image

TG: తమ్ముడి కులాంతర వివాహం అన్న చావుకొచ్చిన ఘటన MBNR(D)లో జరిగింది. రంగారెడ్డి(D) ఎల్లంపల్లికి చెందిన రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన భవానీ ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో యువతి తండ్రి వెంకటేశ్ పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. రాజశేఖర్ సహకారంతోనే ఇదంతా జరిగిందని వెంకటేశ్ మరో ఐదుగురితో కలిసి రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపాడు.