News November 28, 2024
ఫుడ్ పాయిజన్.. ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: ఇటీవల గురుకులాల్లో విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్కు గురవడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఘటనలు జరిగిన విద్యాసంస్థలను సందర్శించి, విచారించడానికి టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. అటు ప్రిన్సిపాల్ లేదా వార్డెన్, మరో ఇద్దరు సిబ్బందితో ఫుడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసింది. స్కూల్స్, వెల్ఫేర్ హాస్టళ్లు, రెసిడెన్షియల్స్, అంగన్వాడీ సెంటర్లలో ఈ కమిటీ రుచి చూశాకే విద్యార్థులకు ఫుడ్ వడ్డిస్తారు.
Similar News
News November 14, 2025
ఆర్జేడీకే ఎక్కువ ఓట్లు వచ్చినా..!

ప్రతిపక్ష ఆర్జేడీని మరోసారి పరాజయం వెంటాడింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినా అదే స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది. 143 సీట్లలో పోటీ చేసిన ఆర్జేడీ 22.84 శాతం ఓట్లు సాధించింది. ఇవి బీజేపీకి వచ్చిన ఓట్ల కంటే 1.86 శాతం, జేడీయూ కంటే 3.97 శాతం ఎక్కువ. ప్రస్తుతం 26 సీట్లలోనే ఆర్జేడీ ఆధిక్యంలో ఉండటం గమనార్హం. ఎన్డీయే 204 స్థానాల్లో లీడ్లో ఉంది.
News November 14, 2025
IPL: కోల్కతా బౌలింగ్ కోచ్గా సౌథీ

న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీని తమ జట్టు బౌలింగ్ కోచ్గా నియమించినట్లు KKR ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సౌథీ.. 2021-2023 మధ్య ఐపీఎల్లో KKR తరఫున ఆడారు. ఇటీవలే షారుక్ ఖాన్ ఫ్రాంచైజీ అభిషేక్ నాయర్ను హెడ్ కోచ్గా, షేన్ వాట్సన్ను అసిస్టెంట్ కోచ్గా నియమించింది.
News November 14, 2025
వీటిని డీప్ ఫ్రై చేస్తే క్యాన్సర్ వచ్చే ఛాన్స్

బాగా ఫ్రై చేసిన కొన్ని పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మాంసాన్ని డీప్ ఫ్రై చేస్తే హెటెరోసైక్లిక్ అమైన్స్, హైడ్రోకార్బన్స్, బంగాళదుంపలు, బ్రెడ్ డీప్ ఫ్రై చేస్తే అక్రిలైమైడ్, చికెన్ను డీప్ ఫ్రై చేస్తే కార్సినోజెన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి DNAను దెబ్బతీసి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఉడకబెట్టడం, బేకింగ్ మంచిదని సూచిస్తున్నారు.


