News October 31, 2024
200 ఏళ్లుగా ఈ ఊళ్లో దీపావళి రోజున చీకట్లే

AP: శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పున్నానపాలెం 200 ఏళ్లుగా దీపావళి పండుగకు దూరంగా ఉంటోంది. అప్పట్లో పండుగ రోజే ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి పాము కాటుకు గురై మృతిచెందింది. అదే రోజు రెండు ఎద్దులు కూడా మృత్యువాతపడ్డాయి. దీంతో గ్రామస్థులంతా తీవ్ర విషాదంలో మునిగిపోవడంతో తమ ఊర్లో దీపావళి జరుపుకోకూడదని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి దీపావళికి ఆ గ్రామంలో దీపాలు కూడా వెలిగించరు.
Similar News
News February 7, 2026
మెత్తబడ్డ PCB.. T20 WCలో భారత్-పాక్ పోరు పక్కా?

భారత్తో మ్యాచ్ బాయ్కాట్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది. రూట్ మార్చి ICCతో చర్చలు ప్రారంభించింది. భారీ జరిమానాలు, బైలేటరల్ సిరీస్లపై నిషేధం వంటి గట్టి వార్నింగ్లు రావడంతోనే పాక్ దారికొచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలంక బోర్డు కూడా ఆర్థిక నష్టాల దృష్ట్యా ఆడమని కోరింది. దీంతో వచ్చే ఆదివారం కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై మళ్లీ ఆశలు చిగురించాయి.
News February 7, 2026
టీమ్ ఇండియాకు షాక్.. కుప్పకూలిన టాపార్డర్

టీ20 వరల్డ్ కప్: అమెరికాతో మ్యాచ్లో టీమ్ ఇండియా టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాక ఇషాన్, తిలక్ కాస్త ఫామ్లో కనిపించారు. కానీ కాసేపటికే ఇషాన్(20) క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. రెండు బంతుల తేడాతోనే తిలక్(25) కూడా క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. శివమ్ దూబే కూడా గోల్డెన్ డక్ అయ్యారు. 6వ ఓవర్లో 3 వికెట్లు పడ్డాయి. భారత్ స్కోర్ 7 ఓవర్లలో 49/4గా ఉంది.
News February 7, 2026
ఇండియాలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే: మోహన్ భాగవత్

హిందూ అనే పదం పేరు కాదని, అది ఒక విశేషణం అని RSS చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ఇండియాలో నివసించే ప్రతిఒక్కరినీ హిందువుగా సంబోధించొచ్చని పేర్కొన్నారు. RSS ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని తెలిపారు. తమకు అధికారం, పబ్లిసిటీ కూడా అవసరం లేదన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి యాక్టర్ సల్మాన్ ఖాన్, హేమా మాలినీ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.


