News October 8, 2025
అరటి పంట పెరుగుదల, పండు నాణ్యత కోసం..

అరటి మొక్కకు కొద్దిపాటి రసాయన ఎరువులతో పాటు ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులను వేయడం వల్ల మొక్క ఎదుగుదలతో పాటు పండు నాణ్యత పెరుగుతుంది. 300 గ్రాముల భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 5 కేజీల బాగా చిలికిన పశువుల ఎరువుతో కలిపి మొక్కలకు అందించాలి. 45 సెం.మీ పొడవు, వెడల్పు, లోతుతో గుంతలు తీసి అందులో ఈ ఎరువును వెయ్యాలి. భాస్వరం ఎరువులు పంట మొదటి దశలోనే అవసరం. తర్వాతి దశలో అవసరం ఉండదు.
Similar News
News March 26, 2026
కొత్తగా 620 డ్రైవింగ్ స్కూళ్లతో కోటి ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ

దేశంలోని 120 జిల్లాలు, 500 బ్లాకు(జిల్లా సబ్డివిజన్)ల్లో డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో వీటిని ప్రారంభిస్తామని వెల్లడించారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికే 200 డ్రైవింగ్ స్కూళ్లు ఓపెన్ చేసిందని పేర్కొన్నారు. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందన్నారు.
News March 26, 2026
IPL: రెండో ఫేజ్ షెడ్యూల్ వచ్చేసింది

IPL-2026 రెండో ఫేజ్ షెడ్యూల్ను BCCI రిలీజ్ చేసింది. APR 13- MAY 24 వరకు 12 వేదికల్లో 50 లీగ్ మ్యాచులు జరగనున్నాయి. తొలి ఫేజ్ మార్చి 28 – ఏప్రిల్ 12వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ప్లే ఆఫ్స్ మ్యాచుల షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని BCCI చెప్పింది. బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్పూర్, న్యూ చండీగఢ్లో మ్యాచులు జరగనున్నాయి.
News March 26, 2026
రేపు ‘పెద్ది’ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి రేపు అదిరిపోయే అప్డేట్ రానుంది. ‘చరణ్ బ్యాట్ పట్టుకోవడాన్ని చూశారు. కానీ ఇప్పుడు ఆయన గదతో వస్తున్నారు’ అంటూ బుచ్చిబాబు ఓ పోస్టర్ను విడుదల చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా రేపు 9.45AMకి వస్తున్నారంటూ ట్వీట్ చేశారు. దీంతో ఇది ఏమయ్యుంటుందా? అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ చిత్రం విడుదలవనుంది.


