News March 14, 2025

రంగులు చల్లడం వద్దన్నందుకు..

image

రంగులు చల్లడం వద్దని వారించినందుకు రాజస్థాన్‌లో ఓ యువకుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టిచంపారు. హన్సరాజ్(25) స్థానిక లైబ్రరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు హోలీ పేరుతో అతనిపై రంగులు చల్లేందుకు ప్రయత్నించగా హన్స్‌రాజ్ వద్దని వారించాడు. దీంతో అతడిపై దాడి చేయగా మరణించాడు. కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Similar News

News January 22, 2026

ఇది లొట్టపీసు కేసు.. బరాబర్ విచారణకు వెళ్తా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు తప్ప పీకిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఇది లొట్టపీసు కేసు. ఇప్పటివరకు నేను ఆ నోటీసులే చూడలేదు. అయినా బరాబర్ విచారణకు వెళ్తా. ఎవరికీ భయపడేది లేదు. రేవంత్‌కు అసలే భయపడను. మేం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు వదిలిపెట్టం’ అని సిరిసిల్ల ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేశారు.

News January 22, 2026

టెక్ యుగంలో వెండి కీలక లోహం: రాబర్ట్ కియోసాకి

image

వెండికి భవిష్యత్తులో మరింత ఎక్కువ ప్రాధాన్యం వస్తుందని ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి అభిప్రాయపడ్డారు. వెండి కేవలం డబ్బుగా కాకుండా టెక్నాలజీ యుగంలో “స్ట్రక్చురల్ మెటల్”గా మారిందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో దీని వినియోగం పెరుగుతోందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ప్రస్తుత టెక్ యుగంలో వెండి అంతే కీలకంగా మారిందని తెలిపారు.

News January 22, 2026

తొలిసారిగా స్వయం జనగణనకు అవకాశం

image

TG: జనగణనలో తొలిసారిగా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇంటింటి సర్వే ఆరంభానికి 15 రోజుల ముందు వరకు ఇందుకు అవకాశమిచ్చింది. ఈమేరకు గెజిట్ జారీచేసింది. కాగా రాష్ట్రంలో 2026 APR1 నుంచి జన గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జనగణన SEP 30 వరకు జరుగుతుందని పేర్కొంది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ గణన చేపట్టనున్నారు.