News February 4, 2025

EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం

image

TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.

Similar News

News March 28, 2026

అంతరిక్షంలో పిల్లలు పుడతారా?

image

అంతరిక్షంలో పునరుత్పత్తిపై జరిగిన పరిశోధనలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జీరో గ్రావిటీ వల్ల వీర్యకణాలు తమ దిశను కోల్పోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిపై వెళ్లినట్లుగా ఇవి సరైన మార్గంలో ప్రయాణించలేకపోవడంతో అంతరిక్షంలో సహజ గర్భధారణ కష్టమని తేలింది. భవిష్యత్తులో ఇతర గ్రహాలపై నివాసాలు ఏర్పరచుకోవాలన్న ఆలోచనకు ఈ సమస్య పెద్ద సవాలుగా మారనుంది. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి.

News March 28, 2026

Polyamory.. Tolyamory.. ఈ డేటింగ్ ట్రెండ్స్ తెలుసా?

image

డేటింగ్ ప్రపంచంలో కొత్త పదాలు వినిపిస్తుంటాయి. పార్ట్‌నర్ పర్మిషన్‌తో అందరికీ తెలిసేలా ఒకే టైమ్‌లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో రిలేషన్ కొనసాగించడాన్ని ‘Polyamory’ అంటారు. ఇందులో ట్రాన్స్‌పరెన్సీ ముఖ్యం. మరోవైపు తన పార్ట్‌నర్‌కు బయట వేరే వ్యక్తితో సంబంధం ఉందని తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడాన్ని ‘Tolyamory’ అంటారు. సమాజంలో ఎప్పటి నుంచో ఉన్న ఈ మౌన అంగీకారానికి ఈ కొత్త పేరు వచ్చి చేరిందంతే.

News March 28, 2026

మూసీ పునరుద్ధరణ: ఆలయానికి సీఎం రేవంత్ శంకుస్థాపన

image

TG: రంగారెడ్డి జిల్లా మంచిరేవుల వద్ద శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్లతో ఈ నిర్మాణాన్ని మూసీ పునరుద్ధరణలో భాగంగా ప్రభుత్వం చేపడుతోంది. ఆలయంలో వంద అడుగుల గాలి గోపురం, మూసీ నది మధ్యలో వంద అడుగుల శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. నదీజలాలను కాపాడుకోవడం మన బాధ్యత అని సీఎం రేవంత్ చెప్పారు.