News April 13, 2024

19 ఏళ్లలో తొలిసారి.. TCSలో ఉద్యోగులు తగ్గారు

image

ప్రముఖ ఐటీ కంపెనీ TCSలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. 2004లో ప్రారంభమైన ఈ సంస్థలో ఏటా ఉద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉండగా, 19 ఏళ్లలో తొలిసారి 2023-24లో సిబ్బంది సంఖ్య 13,249 మేర తగ్గింది. 2022-23లో 6,14,795 మంది ఎంప్లాయీస్ ఉండగా, 2023-24లో ఆ సంఖ్య 6,01,546కు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఐటీ రంగానికి డిమాండ్ తగ్గడం, ఆర్థిక తిరోగమనం వల్ల ఈ పరిస్థితి ఉన్నట్లు నిపుణుల అంచనా.

Similar News

News April 2, 2026

రాష్ట్రానికి YCP పీడ విరగడవ్వాలి: CBN

image

AP: అమరావతిపై YCPకి ఇప్పటికీ జ్ఞానోదయం కలగలేదని CM CBN విమర్శించారు. ‘అసెంబ్లీలో తీర్మానం పెడితే రాలేదు. కనీస జ్ఞానముండే వ్యక్తి అయితే రావాలి. పార్లమెంటులో అమరావతిని వ్యతిరేకించిన ఏకైక పార్టీ YCP. ఆ పార్టీ పేరు పలకాలా? ప్రజలంతా ఇక దాన్ని మరిచిపోవాలి. ఈ రాష్ట్రానికి వైసీపీ పీడ విరగడవ్వాలి’ అని అన్నారు. మావిగన్ ఏంటో అర్థం కాలేదని, డిక్షనరీలోనూ లేదని ఎద్దేవా చేశారు.

News April 2, 2026

హార్ముజ్ సంక్షోభంపై కీలక భేటీ.. భారత్ అటెండ్!

image

హార్ముజ్ మీదుగా నౌకల రాకపోకలపై UK ఏర్పాటు చేయనున్న కీలక సమావేశంలో భారత్ పాల్గొంటుందని కేంద్రం తెలిపింది. ఈరోజే జరగనున్న ఈ వర్చువల్ భేటీకి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరవుతారని వెల్లడించింది. గ్యాస్, ఇంధనంతో వస్తున్న భారత నౌకల భద్రత కోసం ఇరాన్ సహా ఇతర దేశాలతో టచ్‌లో ఉన్నామని, ఇప్పటికే 6 నౌకలు సేఫ్‌గా దాటాయని తెలిపింది. హార్ముజ్‌ సంక్షోభాన్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఈ భేటీ జరగనుంది.

News April 2, 2026

దేశమంతా అమరావతి వెంట నిలబడింది: CBN

image

AP: అమరావతి అత్యంత పవిత్ర స్థలమని CM CBN అభివర్ణించారు. ‘దేశంలోని అన్ని ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి మట్టిని, నదుల నుంచి జలాన్ని తెచ్చి పునీతం చేశాం. అలాంటి ఈ ప్రాంతాన్ని గత పాలకులు మూడుముక్కలాటతో విధ్వంసం చేశారు. కానీ ఇవాళ పార్లమెంటులో YCP తప్ప దేశంలోని అన్ని పార్టీలు అమరావతి వెంట నిలిచాయి’ అని ఉద్దండరాయునిపాలెంలో నిర్వహించిన సభలో పేర్కొన్నారు. అమరావతిని వరల్డ్ బెస్ట్ సిటీగా మారుస్తామన్నారు.