News October 28, 2024

భారత్ చరిత్రలో తొలిసారి!

image

ప్రతిష్ఠాత్మక మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 కిరీటాన్ని భారత్ గెలుచుకుంది. పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రాచెల్ గుప్తా పోటీలో విజయం సాధించి మన దేశానికి తొలి కిరీటాన్ని తెచ్చిపెట్టారు. దీంతోపాటు గ్రాండ్ పేజెంట్స్ ఛాయిస్ అవార్డునూ ఆమె గెలుచుకున్నారు. ఇందులో 70 దేశాలకు చెందిన పోటీదారులు పాల్గొన్నారు. ‘మనం సాధించాం. భారత చరిత్రలో మొదటి గోల్డెన్ క్రౌన్‌ను గెలిచాం’ అని రాచెల్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

Similar News

News December 3, 2025

ప్రజలను కేంద్రం దగా చేస్తోంది: రాహుల్ గాంధీ

image

కుల గణనపై కేంద్రం తీరును రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ‘పార్లమెంటులో కుల గణనపై నేనో ప్రశ్న అడిగా. దానికి కేంద్రం ఇచ్చిన సమాధానం విని షాకయ్యాను. సరైన ఫ్రేమ్ వర్క్ లేదు, టైమ్ బౌండ్ ప్లాన్ లేదు, పార్లమెంట్‌లో చర్చించలేదు, ప్రజలను సంప్రదించలేదు. కులగణనను విజయవంతంగా చేసిన రాష్ట్రాల నుంచి నేర్చుకోవాలని లేదు. క్యాస్ట్ సెన్సస్‌పై మోదీ ప్రభుత్వ తీరు దేశంలోని బహుజనులను దగా చేసేలా ఉంది’ అని ట్వీట్ చేశారు.

News December 3, 2025

NIEPMDలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిఫుల్ డిజబిలిటీస్ (NIEPMD) 25 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు DEC 26వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG, B.Ed, M.Ed (Spl.edu), PhD, M.Phil, PG( సైకాలజీ, ఆక్యుపేషనల్ థెరపీ), డిగ్రీ (ప్రోస్థెటిక్స్&ఆర్థోటిక్స్), B.Com, M.Com, MBA, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://niepmd.nic.in

News December 3, 2025

జీడిమామిడిలో టీ దోమ పూర్తి నివారణకు సూచనలు

image

జీడిమామిడి కొత్త చిగురు వచ్చే సమయంలో లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 1.6ml కలిపి పిచికారీ చేయాలి. పూత వచ్చాక లీటరు నీటికి లాంబ్డాసైహలోథ్రిన్ 0.6ml లేదా క్లోరీపైరిఫాస్ 2mlను కలిపి పిచికారీ చేయాలి. గింజ బటాని సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి ప్రోఫెనోఫోస్ 1ml కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులను మార్చి నెల వరకు అవసరాన్నిబట్టి 2 లేక 3 సార్లు కాండం, కొమ్మలు, ఆకులు, చిగుర్లు, పూత, పిందే తడిచేలా పిచికారీ చేయాలి.