News March 20, 2024

ఎన్నికల తర్వాత పెరగనున్న విదేశీ పెట్టుబడులు!

image

భారత మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల జోరు ఎన్నికల తర్వాత మరింత పెరుగుతుందని జేపీ మోర్గాన్ సంస్థ అంచనా వేసింది. భారత్ ఆర్థికవృద్ధి కొనసాగుతుండటం, ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ రంగంలోనూ ఈ విదేశీ పెట్టుబడుల హవా కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఈ రంగంలో ఇంటర్నేషనల్ ఫండ్స్ 1.70% లాభాన్ని నమోదు చేశాయి.

Similar News

News October 16, 2025

మధ్యాహ్నం కేబినెట్ భేటీ.. సురేఖ వస్తారా..?

image

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా దంపతుల వ్యవహారం మరింత ముదిరింది. పొంగులేటిపై టెండర్ల విషయంలో కామెంట్లు సహా, రెడ్లంతా తమ ఫ్యామిలీపై కుట్ర చేస్తున్నారని ఆమె కూతురు ఆరోపణలు చేయడం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం కేబినెట్ భేటీ ఉండగా ఆమె వస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అటు సురేఖ రాజీనామా చేస్తారని కొందరు, ఆమెను తప్పిస్తారని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

News October 16, 2025

పోరాటం ఆపినప్పుడే నిజంగా ఓడినట్లు: విరాట్ కోహ్లీ

image

కోహ్లీ WC2027 వరకూ కొనసాగుతారా? లేక ఆలోపే రిటైర్ అవుతారా? అని చర్చ జరుగుతున్న వేళ రన్ మెషీన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్టు’ అని పేర్కొన్నారు. దీంతో WC వరకు తాను కొనసాగుతానని, గివప్ చేసే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నెల 19నుంచి జరగనున్న AUS సిరీస్ కోసం కోహ్లీ ఆ దేశానికి వెళ్లిన విషయం తెలిసిందే.

News October 16, 2025

తాజా సినీ ముచ్చట్లు!

image

* రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న ‘పెద్ది’ మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఇప్పటికే షూట్ పూర్తయింది
* ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈనెల 23న ‘ఫౌజీ’ సినిమా నుంచి అప్డేట్స్ రానున్నాయి.
* మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చి ఫుట్‌పాల్ పెరిగిందని, కానీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ వ్యాఖ్యలు ఎంతో కష్టపడి తీసిన చిత్రాన్ని ఇబ్బందిపెట్టాయని ‘అరి’ డైరెక్టర్ జయశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు