News November 3, 2024

ఫారిన్ ఇన్వెస్టర్లు ₹94 వేల కోట్లు వెన‌క్కి తీసుకున్నారు.. కార‌ణం ఇదే!

image

దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట‌ర్లు అక్టోబ‌ర్‌లో ₹94,000 కోట్ల పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ముందెన్న‌డూ ఒక నెల‌లో ఈ స్థాయి డిజిన్వెస్ట్‌మెంట్ జ‌ర‌గ‌లేదు. ఈక్విటీ మార్కెట్లను ఓవ‌ర్ వ్యాల్యూగా ప‌రిగ‌ణించ‌డం, చైనా మార్కెట్ల ఆక‌ర్ష‌ణీయ వ‌డ్డీ రేట్లే దీనికి కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా FIIలు జాగ్రత్తపడుతున్నారు!

Similar News

News November 19, 2025

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు యథాతథం: మంత్రి

image

TG: <<18308868>>జిన్నింగ్<<>> మిల్లర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి సమస్యలపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నేటి నుంచి పత్తి కొనుగోళ్లను కొనసాగించాలన్నారు. మరోవైపు మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18 నుంచి 25 క్వింటాళ్లకు, సోయాబీన్ 6.72 నుంచి 10qlకు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అథెంటికేషన్‌తో పాటు మొబైల్ OTP ఆధారంగా కొనుగోళ్లు జరపాలని సూచించారు.

News November 19, 2025

9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు

image

AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నిన్న అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.

News November 19, 2025

టికెట్లు బుక్ చేసుకున్నారా?

image

తిరుమల శ్రీవారిని అతి దగ్గర నుంచి దర్శించుకునే అదృష్టం లక్కీ డిప్‌లో ఎంపికైన వారికి లభిస్తుంది. అందుకు సంబంధించి ఫిబ్రవరి కోటా సేవా టికెట్లు నిన్న విడుదలయ్యాయి. TTD అధికారిక వెబ్‌సైట్‌లో రేపు ఉ.10 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారు స్వామివారికి అతి చేరువలో ఉంటూ, కొన్ని నిమిషాల పాటు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ☞ టికెట్ ధరలు, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.