News November 3, 2024

ఫారిన్ ఇన్వెస్టర్లు ₹94 వేల కోట్లు వెన‌క్కి తీసుకున్నారు.. కార‌ణం ఇదే!

image

దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట‌ర్లు అక్టోబ‌ర్‌లో ₹94,000 కోట్ల పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకున్నారు. ముందెన్న‌డూ ఒక నెల‌లో ఈ స్థాయి డిజిన్వెస్ట్‌మెంట్ జ‌ర‌గ‌లేదు. ఈక్విటీ మార్కెట్లను ఓవ‌ర్ వ్యాల్యూగా ప‌రిగ‌ణించ‌డం, చైనా మార్కెట్ల ఆక‌ర్ష‌ణీయ వ‌డ్డీ రేట్లే దీనికి కార‌ణ‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా FIIలు జాగ్రత్తపడుతున్నారు!

Similar News

News September 16, 2025

16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధం

image

డ్రగ్ ట్రాఫికింగ్ కేసుల్లో పట్టుబడిన 16 వేల మంది విదేశీయులపై చర్యలకు కేంద్రం సిద్ధమైంది. వారిని స్వదేశాలకు పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటికే రాష్ట్రాల వారీగా డ్రగ్ ట్రాఫికర్స్ జాబితా సిద్ధం చేసి కేంద్ర హోం శాఖకు పంపినట్లు వెల్లడించాయి.

News September 16, 2025

యువరాజ్, ఉతప్ప, సోనూసూద్‌లకు ED సమన్లు

image

భారత మాజీ క్రికెటర్లు యువరాజ్, ఉతప్ప, బాలీవుడ్ నటుడు సోనూసూద్‌లకు ED సమన్లు జారీ చేసింది. ఇల్లీగల్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్(1xBet)కు సంబంధించి మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ క్రికెటర్లు రైనా, ధవన్, మాజీ నటి మిమీ చక్రవర్తిలను ED విచారించింది. కాగా 1xBet యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న నటి ఊర్వశీ రౌతేలాకు గతంలోనే సమన్లు జారీ చేసింది.

News September 16, 2025

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

image

TG: సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య‌పై ఎఫ్ఐఆర్‌ను 2016లో హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇవాళ దీనిపై CJI జస్టిస్ గవాయి ధర్మాసనం విచారణ జరిపింది. సెప్టెంబర్ 22న తదుపరి విచారణ చేస్తామని వెల్లడించింది.