News December 12, 2024
భారత్ను ముక్కలు చేయాలనుకుంటున్న విదేశీ శక్తులు: ధన్ఖడ్

దేశాభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని విదేశీ శక్తులు భారత్ను ముక్కలు చేయాలనుకుంటున్నాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. రాజ్యాంగ వ్యవస్థల సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజలు ఐకమత్యంతో యాంటీ ఇండియా నెరేటివ్ను న్యూట్రలైజ్ చేయాలన్నారు. ‘భారత్ శక్తిసామర్థ్యాలున్న దేశమని మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం వేగంగా ఎదుగుతున్నాం. దీనినెవ్వరూ అడ్డుకోలేరు’ అని చెప్పారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


