News July 3, 2024
నల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719974190792-normal-WIFI.webp)
AP: నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో అడవి దున్న కెమెరా ట్రాప్లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోతున్నారు. వెలుగోడు రేంజ్లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.
Similar News
News July 5, 2024
కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720172099507-normal-WIFI.webp)
ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. సీబీఐ కేసులో ఈనెల 18 వరకు రిమాండ్ను పొడిగించింది.
News July 5, 2024
రోహిత్ శర్మకు ‘స్వీట్ హోమ్’ వెల్కమ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720171227002-normal-WIFI.webp)
టీ20 వరల్డ్ కప్తో స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు తన ఇంట్లో స్వీట్ వెల్కమ్ లభించింది. ఇంటి నిండా పూలు చల్లి ఆయనను కుటుంబసభ్యులు ఆహ్వానించారు. రోహిత్ను హత్తుకుని తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా నిన్న ముంబైలో జరిగిన ఓపెన్ టాప్ బస్ పరేడ్ అనంతరం రోహిత్ నేరుగా తన నివాసానికి వెళ్లారు.
News July 5, 2024
విక్టరీ పరేడ్లో తప్పిపోయిన పిల్లలు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720153421059-normal-WIFI.webp)
‘విక్టరీ పరేడ్’లో పాల్గొనేందుకు ముంబైలోని మెరైన్ డ్రైవ్కు లక్షల మంది హాజరయ్యారు. T20WC ట్రోఫీతో భారత జట్టు ప్రయాణిస్తోన్న బస్సు తమవద్దకు రాగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. దీంతో చాలా మంది పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి తప్పిపోయారు. దాదాపు డజను మంది తప్పిపోయిన పిల్లలు మెరైన్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు సురక్షితంగా వారి పేరెంట్స్ వద్దకు చేరినట్లు సమాచారం.