News December 22, 2024
తెలుగు రాష్ట్రాల్లో తరుగుతున్న అటవీ సంపద!

దేశవ్యాప్తంగా అటవీ సంపద గణనీయంగా తగ్గిందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 2021తో పోలిస్తే గత ఏడాది 138.66 చదరపు కిలోమీటర్లు, తెలంగాణలో 100.42 చ.కి అటవీ భూమి తగ్గిపోయిందని పేర్కొన్నారు. తొలి స్థానంలో మధ్యప్రదేశ్(371.54 చ.కి) ఉండగా రెండో స్థానంలో ఏపీ, మూడో స్థానంలో తెలంగాణ ఉండటం గమనార్హం.
Similar News
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<
News November 9, 2025
పాడి పశువుల కొనుగోళ్లు – ఈ జాగ్రత్తలతో మేలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.
News November 9, 2025
హనుమాన్ చాలీసా భావం – 4

కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా ||
ఓ దేవా! నీవు బంగారు కాంతులీనే దేహంతో, అత్యంత శోభాయమానమైన సుందర వస్త్రాలను ధరించి విరాజిల్లుతావు. నీ చెవులకు ధరించిన మనోహరమైన కుండలాలు, మృదువుగా మెలికలు తిరిగిన (కుంచితమైన) నీ కేశాలు నీ రూపానికి అసాధారణ సౌందర్యాన్ని చేకూర్చుతాయి. నీ దివ్యమైన రూపం దృష్టిని ఆకర్షించి, మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. <<-se>>#HANUMANCHALISA<<>>


